కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీరని మానసిక వ్యధతో ఉన్నారా? ఆమె హఠాత్తుగా రాష్ట్రపతి భవన్కి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ తో భేటీ కావడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో లేని ఈ భేటీపై దేశ రాజధాని వర్గాల్లో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమె తాజా వ్యధకు ప్రధాన కారకుడు కాగా, తనయుడు రాహుల్ గాంధీ రెండో కారణంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా పర్యటన నుంచి తిరిగొస్తూ కోల్గేట్ వ్యవహారంలో తాను సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడంతో ఆమె కంగుతిన్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రకటన వెనుక మన్మోహన్ మనోక్షోభ దాగి ఉందని ఆమె భావించారు. సీబీఐ విచారణకు హాజరు కావడం ద్వారా తాను నిష్కళంకుడినని నిరూపించు కోవాలని, అధికారాంతంలో అది తనకు చాలా ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. లేనిపక్షంలో జీవితాంతం తాను, తన కుటుంబం ఈ మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుందని, తన కుటుంబానికి అంతటి శిక్షను తాను వేయదలుచుకోకనే సీబీఐ విచారణకు సిద్దమని ప్రకటించారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ విచారణను ఎదుర్కోవడం ద్వారా తాను చట్టానికి అతీతుణ్ణి కాదని నిరూపించాలని ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
మన్మోహన్ వెంట రష్యా, చైనా పర్యటనలకు వెళ్లిన పాత్రికేయుల అభిప్రాయం ప్రకారం మన్మోహన్ ఆ పర్యటనలో ఏమాత్రం ఉత్సాహంగా కనిపించలేదు. సహజంగానే ముభావంగా ఉండే ప్రధాని మరింతగా బిగుసుకుపోయి, నిరుత్సాహంగా కనిపించారు. ఆయన్ని అక్కడ కూడా కోల్గేట్ భూతం వెన్నాడిందని అంటు న్నారు. దీంతో ఆయన మనస్సు కకావికలమైందని, అందుకే భారత గడ్డమీదకు వస్తూనే తన అంతరంగంలోని మాటను బైటపెట్టారని అంటున్నారు. నిజానిజాలు బైటికి రావాలంటే తానూ విచారణకు సిద్ధం కావడమొక్కటే పరిష్కారమని ఆయన నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇదేగనక జరిగితే మన్మోహన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారని సోనియాగాంధీ భావించారు. ఈ తరుణంలో ఆయన నిష్క్రమణ తీవ్ర రాజకీయ సంక్షోభానికి కారణమవుతుందని ఆమె భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వంక లోక్సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లోకి వస్తున్న దశలో ఇంతటి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఆమెకి సుతరామూ ఇష్టం లేదు. ఒకవేళ మన్మోహన్ ప్రధాని పదవి నుంచి దిగిపోతే ఇప్పటి కిప్పుడు రాహుల్గాంధీని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేంత సాహసం తనకు లేదని కూడా సోనియాగాంధీ మధనపడు తున్నారు.
పైగా రాహుల్గాంధీ ఇప్పటికీ అపరిపక్వ ప్రకటనలు చేస్తూ సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆమె భావిస్తున్నారు. ఒక వంక ప్రధాని, మరోవంక తనయుడు.. ఏకకాలంలో సృష్టించిన రాజకీయ తుపానును ఎలా ఎదుర్కోవాలో తెలీక..తన కోటరీలోని ఆంతరంగికులతో మాట్లాడలేక సోనియాగాంధీ రాష్ట్రపతి శరణుజొచ్చారని ఇక్కడి రాజకీయ వర్గాలే కాకుండా కాంగ్రెస్లోని సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు. అయితే రాష్ట్రపతి ఏమి సలహా ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more