మన ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కు ఆ రెండు లేవనే నిజాన్ని .. ఈరోజు బయట పెట్టారు. ఇప్పటి వరకు ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ఆ రెండు లేకుండా ఉన్నడంటే.. మనదేశంతో పాటు .. ఇతర దేశాల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. కంప్యూటర్ యుగంలో.. ఇలాంటి వ్యక్తి ఎవరైన ఉంటార అంటే.. అది మన ప్రదాని మంత్రి మన్మోహన్ సింగే అని అంటున్నారు. ప్రధాని మంత్రి ఆ రెండు లేవంటే.. మనవాళ్లు వెంటనే ఇంకేదో ఆలోచిస్తారు.. కానీ ఇక్కడ అలాంటి వాటికి తావేలేదు. అంటే ఈ స్పీడ్ యుగంలో.. ఆయన రెండికి దూరంగా ఉన్నాడు. ఈ రోజుల్లో 16 ఏళ్లు నిండిన అబ్బాయి, అమ్మాయిల, మొదలు.. 90 ఏళ్లు నిండిన ముసలోడి వరకు ఈ రెండు తప్పనిసరిగా మెయింటేన్ చేస్తున్నారు. మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం ఈ రెండిటికి దూరంగా ఉండటమే ఇప్పడు అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.
అసలు విషయం ఏమిటేంటే.. ప్రధాని మన్మోహన్సింగ్ గారికి ఇంతవరకు సెల్ఫోన్ వినియోగించడంలేదు. ఆయనకంటూ సొంతంగా ఈమెయిల్ అకౌంట్ లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆయన అధికారిక ప్రతినిధే ప్రకటించారు. గార్డియన్ అనే బ్రిటన్కు చెందిన పత్రికలో 35 దేశాల కు చెందిన అగ్రశ్రేణి నాయకుల ఫోన్ సంభాషణల్ని అమెరికా గూఢచారులు ట్రాప్ చేస్తున్నారంటూ ఓ వార్త వెలువడింది. వైట్హౌస్, పెంటగాన్లతో పాటు అమెరికా అధికారులే ఈ నేతల వ్యక్తిగత నంబర్లను సేకరించి గూఢచారి విభాగానికి అప్పగించారని కూడా ఈ వార్త పేర్కొంది.
దీనిపై జర్మన్ ఛాన్సలర్ అంగేలామార్కెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యక్తిగత ఫోన్ సంభాషణల్ని అమెరికా ప్రభుత్వం ట్రాప్ చేసిందంటూ గతంలోనే వికీలీక్స్కు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ బహిర్గతం చేశారు. ఈ జాబితాలో మన్మోహన్ పేరు ఉందేమోనంటూ పలువురు ఆరాతీశారు. అయితే అలాంటి ఆందోళన అక్కర్లేదంటూ ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆయన ఇప్పటికీ ప్రధాని కార్యాలయ అధికారిక ఇమెయిల్ను మాత్రమే వినియోగిస్తున్నారు. ఆయనకంటూ సొంత సెల్ నంబర్ లేదు. కాబట్టి ఇలాంటి ప్రమాదాన్ని మనం శంకించక్కర్లేదంటూ ఆయన తేల్చిచెప్పేశారు.
ఇది నిజంగా భారతీయులకు ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకంటే ప్రపంచంలోనే మొబైల్ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఉంది. వ్యక్తిగత కమ్యూనికేషన్ రంగంలో చైనాతో సహా ఏ దేశం భారత్తో పోటీపడే పరిస్థితిలో లేదు. ఇలాంటి దేశానికి పాలనాబాధ్యతలు వహిస్తున్న మన్మోహన్ మాత్రం ఇప్పటికీ వ్యక్తిగత మొబైల్ఫోన్తో పాటు వ్యక్తిగత ఇమెయిల్ అడ్రస్ లేకపోవడం నిజంగా విడ్డూరమే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more