అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు శిక్షను అనుభవించి ఇటీవలే బెయిల్ పై విడుదల అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తాను పూర్తిగా సమైక్యవాదినని, నా వాదం, నా నినాదం సమైక్యమే అని, సమైక్యాంధ్రకు ఎప్పుడు నా మద్దతు ఉంటుందని తెలిసిన జగన్ సమైక్యాంధ్ర కోసం రాజకీయ పార్టీగా తొలి సభను హైదరాబాద్ లో నిర్వహిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైదరాబాద్లో సమైక్యశంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. . అయితే జగన్ తలపెట్టిన ఈ సభ పై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రాంత నాయకులు ముప్పేట దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి వైసీపీ సభకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లేనని అన్నారు.
తెలంలగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ జగన్ సభ పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో వైసీపీ సభ పెట్టి మా హక్కులను హరించాలని చూస్తే సహించేది లేదని, తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం కోసమే జగన్ హైదరాబాదులో సమైక్య సభ పెడతామని చెబుతున్నారని, సీమాంధ్రుల నోట్ల కట్టలకు తెలంగాణ నోట్ ఆగిందా అనే అనుమానం తెలంగాణ ప్రజలలో కలుగుతోందని కోదండరాం విమర్శించారు . టీఆర్ఎస్ నేత కే.కేశవరావు తనదైన స్టైల్లో జగన్ సభ పై విమర్శలు చేశారు. హైదరాబాద్లో అల్లర్లు రేపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని , రాజకీయ బల ప్రదర్శన నిరూపించుకోవడానికే హైదరాబాద్ నడిబొడ్డున సభను నిర్వహించ తలపెట్టారని, జైల్లో కెళ్లి వచ్చిన నాయకులు సభను పెడతానంటే ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందో చూస్తామని కేకే అన్నారు.
సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ... సమైక్య సభ పెట్టడం ఇబ్బందికర పరిణామమని సభ పెడితే పరిస్థితులు మారుతాయని ఆయన అన్నారు. సమయం దగ్గరపడుతున్నా కొద్ది జగన్ సభ పై ముప్పేట దాడి మొదలైంది. ఈ పరిస్థితి చూస్తుంటే సభ జరగం కష్టమే అంటున్నారు కొందరు. వీరందరి నుండి వస్తున్న విమర్శలకు వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more