వెనక్కి తగ్గిన కేంద్రం
దోషులుగా తేలిన చట్టసభ సభ్యుల్ని రక్షించే వివాదస్పద ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు రాహుల్ గాంధీ, రాష్ట్రపతి తో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భేటీ అయిన విషయం తెలిసిందే. కేంద్రం ఆర్డినెన్స్ తేవడం ఏంటీ ? ఇది అర్థం లేని చర్య అంటూ ఇటీవల రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చిన ప్రధాని రాహుల్ తో సమావేశమై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ ఆర్డినెన్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుండడం వల్ల వెనక్కి తగ్గితే మేలని కోర్ కమిటీ అభిప్రాయం పడినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతా ఓ నాటకం
ఆర్డినెన్స్ ను రాహుల్ వ్యతిరేకించడం అంతా ఓ నాటకమని బీజేపీ విమర్శించింది. ఈ వ్యాఖ్యలు ప్రధానిని అవమానపరిచేవేనని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా తాము ఎన్నో విమర్శలు చేసినా ప్రధాని పదవిని ఏనాడు కించపరచలేదని, 2జి, బొగ్గు, కామన్ వెల్త్ కుంభకోణాలపై రాహుల్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. యుపీఏ ప్రభుత్వ పాలనలో వరుస కుంభకోణాలు బయటపడుతున్నాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ఉపసంహరణ..
దోషులకు చట్టసభల అర్హత ఆర్డినెన్స్ ను కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తీసుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ ఈ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకునే అంశంపై అటార్నీ జనరల్ వాహన్ వతి సలహా తీసుకున్నారు. కేబినెట్ సమావేశ అనంతరం వివాదాస్పద ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
ఏకగ్రీవ నిర్ణయం
ఆర్డినెన్స్ ఉపసంహరణపై కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి మనీష్ తివారి వెల్లడించారు. ఈరోజు ప్రధాన మంత్రి నివాసంలో జరిగిన కెబినెట్ భేటీ తరువాత ఆయన మాట్లాడారు. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ఉపసంహరణపై మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బిల్లు ఉపసంహరించేందుకు పార్లమెంట్ లో తీర్మానం పెడుతామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని ప్రధాన మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మనీష్ తివారి పేర్కొన్నారు. కేంద్రం ఆర్డినెన్స్ తేవడం ఏంటీ ? ఇది అర్థం లేని చర్య అంటూ ఇటీవల రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రధాన మంత్రి బుధవారం రాహుల్, రాష్ట్రపతితో భేటీ అయ్యారు. దీనితో ఆర్డినెన్స్ ను ఉపసంహరిస్తారనే వార్తలు వచ్చాయి.
విపక్షాలు
దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలుస్వాగతించాయి. ఈనిర్ణయంపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే హర్షం వెలిబుచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more