వారసత్వ రాజకీయాలు గాంధీల కాలం నుండి నేటి తరం వరకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన స్థానాల్లో గాంధీ కుటుంబానికి సబంధించిన వారు ఉన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఉపాధ్యక్ష్య పదవిలో కొనసాగుతున్నాడు. ఇక అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ఉన్న సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ కూడా రానున్న ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నుండే తెర వెనక నుండి తల్లికి, అన్నకు రాజకీయ పరంగా హెల్ప్ అవుతున్న ప్రియాంక గాంధీ 2014 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనుందని తాజా సమాచారం.
ఆ మధ్యన వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక తన భర్త రాబర్ట్ వాద్రా పై అక్రమ ఆస్తులకు సంబంధించిన వార్తలు రావడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇటీవల బొత్తిగా వార్తల్లో కనిపించకుండా పోయిన ప్రియాంక వచ్చే ఎన్నికల్లో తన తల్లి నియోజక వర్గం అయిన రాయ్ బరేలీ నుండి లొక్ సభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లి అనారోగ్యం పాలు కావడంతో రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనలేక పోవడంతో తన నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవడం వంటి పలుకారణాల కారణంగా ఆమెకు విశ్రాంతి నివ్వడం కోసం ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నియోజక వర్గానికి సంబంధించిన బాధ్యతలు కూడా అప్పగించారు. ఇటీవలే ఆమె జిల్లాలో పార్టీ బాధ్యులను ఎంపిక చేసేందుకు ఇంటర్య్వూలు కూడా నిర్వహించారు. ఇటు తల్లి నియోజక వర్గమే కాకుండా అటు రాహుల్ నియోజక వర్గం అయిన అమేధీ జిల్లాలో కూడా పార్టీ పర్యవేక్షణ కూడా చేస్తుంది. అయితే రాయ్ బరేలీ ప్రతిష్టాత్మకమైన నియోజక వర్గం కాబట్టి భవిష్యత్తు ప్రధానిగా చెప్పుకునే రాహుల్ అక్కడి నుండి పోటీ చేసి, అమేథీ నుండి ప్రియాంకను పోటీకి దించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. చూద్దాం రాజకీయాల్లో తల్లిమించిన తనయురాలు అవుతుందో ? లేదో ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more