కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఒత్తిడి పెంచారు. కేంద్ర కమిటీ కోసం ఈరోజు మంత్రి ఆనం నివాసంలో సీమాంద్ర మంత్రులతో సమావేశం జరిగింది. సీడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంద్ర ప్రజల్లో ఆందోళన ప్రారంభమైందని, రాష్ట్రంలో ప్రభుత్వం స్తంభించిందన్న అభద్రతాభావం ప్రజల్లో ఉందని ఆనం అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల ఆందోళనల ద్రుష్ట్యా ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు.
విభజన నిర్ణయం తర్వాత ప్రతి కార్యకర్త ఉద్యమంలో ఉన్నారన్నారు. సమైక్యాంద్రకు మద్దతుగా ముందుగా సంతకం చేస్తానని ఒక నేత (జగన్) అంటున్నారని, ఆయన తండ్రి సమాధి సాక్షిగా చేసిన ప్రకటనకు ఏం సమాధానమిస్తారని ఆనం ప్రశ్నించారు. అన్ని పార్టీలు ముందు ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఆందుకు మినహాయింపు కాదని, అటువంటప్పుడు కాంగ్రెస్ నే ఎందుకు నిందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సేవ్ ఆంద్రప్రదేశ్ , సేవ్ కాంగ్రెస్ నినాదంతో పనిచేస్తామన్నారు.
ఈ సమావేశంలో నిర్ణయాలను కేంద్ర నాయకత్వానికి తెలియజేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి , బొత్సలను కోరామని , సీఎం కూడా తెలియజేస్తామని చెప్పారు. ఆంటోని కమిటీ రాష్ట్రంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి దారి చూపించాలని ఆనం కోరారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్న విశ్వాసం తమకుందన్నారు.
పాలన స్తంబించడంతో ప్రభుత్వంతో పాటు ఉద్యోగులపై బాధ్యత ఉంటుందని, ప్రజల ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాలు పునరాలోచన చేయాలని ఆనం చూసించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more