తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు ఒక చోట చేరి ఒకరిపై ఒకరు ఆప్యాయతలను ఒలకబోసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు వేణుగోపాల రెడ్డి, సభ్యులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వారి గౌరవార్ధం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో రాత్రి విందును ఏర్పాటు చేశారు. మంత్రివర్గసభ్యులతో పాటు ఆర్థిక శాఖకు చెందిన ప్రధాన అధికారులను ఈ విందుకు ఆహ్వానించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర్, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి, ఐటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి ఈ విందు సమావేశానికి దూరంగా ఉన్నారు, సీమాంధ్రకు చెందిన పెట్టుబడులు, మౌళిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్, అటవీ శాఖ శత్రుచర్ల విజయరామరాజు ఈ జాబితాలో ఉన్నారు. ఆర్థిక సంఘం సభ్యుల పరిచయ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రితో పాటు విందుకు హాజరైన మంత్రులంతా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ కడుపుబ్బనవ్వుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అంశాలేవీ చర్చకు రాలేదని అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, గడచిన మూడేళ్ళతో పోలిస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి కిరణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని, ఔత్సాహికులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తూ ప్రోత్సహిస్తోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు ఎగుమతులు కూడా పెరిగాయని, గత మూడేళ్ళతో పోలిస్తే ఎగుమతుల్లో భారీ వృద్ధిని సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు విరివిగా నిధులను ఖర్చు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం సైతం నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్థిక రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న 14 వ ఆర్థిక సంఘం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ కార్యక్రమాలకు అత్యధిక నిధులు కేటాయిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని సీఎం చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more