అనేక సార్లు బెయిల్ కోసం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్ళగా సెప్టెంబర్ 8 తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తీర్పు నివ్వగా ఇప్పుడు మళ్లీ బెయిల్ కోసం జగన్ తరపు న్యాయవాది పిటిషన్ ను సిబిఐ కోర్టులో దాఖలు చేశారు. జగన్ చంచల్గూడ జైల్లో సంవత్సారం దాటిపోయిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్ను స్వీకరించిన కోర్టు రేపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే అప్పుడు సుప్రీం కోర్టు ఈ నెల 8 లోపు సిబిఐ తుది చార్జ్ షీట్ ను దాఖలు చేయాలని, ఆ తర్వాత బెయిల్ దాఖలు చేసుకోవచ్చని చెప్పింది. అయితే సిబిఐ మాత్రం ఇంకా తుది చార్జ్ షీట్ వేయలేదు. కాగా నిన్ననే సీబీఐ చివరిగా మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది కాని చివరి చార్జ్ షీట్ మాత్రం దాఖలు చేయలేదు. మరి జగన్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ రేపు ఏం కౌంటర్ దాఖలు చేయనుందనేది చర్చనీయాంశమైంది.
అమ్మ ముందు 170 రోజులే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కట్టుబడి ఉన్నారనే వార్తలు కచ్చితంగా వస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, దాని ఫలితాలను కాంగ్రెసు పొందడానికి వీలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 1నుంచి 2014 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకుకోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే, కేవలం 170 రోజులు మాత్రమే సోనియాకు మిగిలి ఉన్నాయి. ఈలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 2009 ఎన్నికల్లో మార్చి 2నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే, వచ్చే ఎన్నికలు సమైక్యాంధ్రలోనే జరుగుతాయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, అన్ని అంశాలపై రాజీ కుదిరితే 180 రోజుల సమయం అవసరం. సీమాంధ్రలో ఉద్యమాలు చెలరేగుతున్న నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకుల్లోనే ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డిసెంబర్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు లేదా ఫిబ్రవరి నెలలో జరిగే ఓటాన్ అకౌంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేంద్రం వడివడిగా తెలంగాణ బిల్లు ఆమోదం కోసం అడుగులు వేస్తున్నా, అసాధారణ జాప్యం జరగడం తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే తెలంగాణపై నోట్ సిద్ధమైనా, కేంద్ర మంత్రిమండలి పరిశీలనకు వెళ్లలేదు. హైదరాబాద్పై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం ఒక అంగుళం కూడా ముందుకు కదలడం సాధ్యమవుతుందా అనేది కూడా మరో ప్రశ్న. హైదరాబాద్ అంశం, జలాల పంపకం, రెవెన్యూ పంపకంలో వాటా, ఉద్యోగుల అంశాలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర విభజనకు 12 దశలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, రెండుసార్లు అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్రం కోరాల్సి ఉంటుంది. ఇప్పుడు నెలకొన్న ఆందోళనల కారణంగా రాష్ట్రం ఏర్పాటుకు అనుసరించాల్సిన రాజ్యాంగ ప్రక్రియ ఇంత స్వల్ప వ్యవధిలో పూర్తవుతుందా అనే అనుమానాలకు తావు కల్పిస్తోంది. అలా కాకుండా రాష్ట్ర విభజన ప్రక్రియ సగంలో ఆగిపోతే, సార్వత్రిక ఎన్నికల అనంతరం 2014 మే, జూన్ నెలల్లో ఏర్పడే ప్రభుత్వం పూర్తిచేయాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more