గత ముప్పై రోజుల నుండి సమైక్య ఉద్యం చేస్తూ, తన సత్తా చాటడానికి, తమ ఉద్యమానికి ఎంత ఊపు ఉందో కేంద్రానికి తెలియజేయడానికి తెలంగాణ నడిబొడ్డున సీమాంధ్ర ఏపీ ఎన్జీఓలు ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్ ’ పేరుతో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న కానీ కేంద్రం ఆ ఉద్యమ తీవ్రతకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన పనితాను చేసుకొని పోతుంది. ఓ వైపు సభ జరగుతుంటూనే అటు కేంద్రం నుండి హోంశాఖ మంత్రి షిండే సీమాంధ్రులకు పుండుమీద కారం చల్లినట్లు ఓ ప్రకటన చేశాడు. ఇప్పటికే తెలంగాణ పై నోట్ ప్రక్రియ ప్రారంభం అయిందని, తెలంగాణ మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. నేడు షిండే కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్వరలోనే కేబినెట్ నోట్ను తయారు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ నోట్ త యారైన తర్వాతే మిగిలిన అంశాలపై దృష్టి పెడతామని ఆయన చె ప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన లేదని, విభజన గురించి రోజు రోజుకు రకరకాల ప్రతిపాదనలు వస్తున్నందునే తెలంగాణ అలస్యం అవుతుందని, కాంగ్రెస్ పార్టీకి అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు కాబట్టే సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న అనంతరం వె ల్లడైన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నియమించిన ఆంటొనీ కమిటీ సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం రావడంవల్లే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్పై మూడు ప్రతిపాదనలు ఉన్నాయని, అయితే వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం అని ఆయన వివరించారు. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడస్తుందో మాత్రం చెప్పలేని అన్నారు.
మరో వైపు చత్తీస్ ఘడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటు పక్రియ విషయం కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. రెండు ప్రాంతాలను విడగొట్టేటప్పుడు రెండు ప్రాంతాలకు సరైన న్యాయం చేయాలని, విభజన పక్రియ సరైన పద్దతిలో చేపట్టలేదని, కాంగ్రెస్ తీరుతో రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని ఆయన అన్నారు. దేశం ముందు కాంగ్రెస్ అభాసుపాలయిందని మోడీ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more