ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని, విడగొట్టనివ్వమని డాక్టర్ మిత్రా అన్నారు. ఎపీఎన్జీవో సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మనందరిదని తెలిపారు. విభజన నిర్ణయం తీసుకుంది సీడబ్లూసీ మాత్రమే అని..ప్రభుత్వం కాదని ఆయన పేర్కొన్నారు. దేశంపై నిర్ణయం తీసుకునే హక్కు సీడబ్లూసీకి లేదని మిత్రా తెలిపారు. ఎలక్షన్లలో గెలవలేని వారు ఎన్ని బింకలకు పోయినా తమ తాటాకు చప్పుల్లకు ప్రజలు భయపడరని హెచ్చరించారు. రాష్ట్రం కోసం నిజాయితీగా ఉన్నామన్న ఎంపీలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అయిపోయిందనడం అబద్దమన్నారు. పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తేనే అప్పుడు ప్రక్రియ ఆగిపోతుందని ఆయన తెలిపారు. ఇకపై తెలంగాణ, సీమాంధ్ర పదాలు వాడొద్దని, ఆంధ్రప్రదేశ్ మనందరిదని, దీనికి ఒకే ఒక్క రాజధాని హైదరాబాద్ అని మిత్రా పేర్కొన్నారు. తమకు రక్షణ కావాలని ఎవరూ అడగలేదన్నారు. ఇంకొంత కాలమే పదవుల్లో ఉండే మీరు తమకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఎంపీలు, మంత్రులు ప్రజాప్రతినిధుల అంతా కలిసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని మిత్రా కోరారు. తమ లేఖల వల్లే విభజన నిర్ణయం జరిగిందని ప్రచారం చేసుకోవడం, యాత్ర లు చేస్తున్నవారు వాటిన ఒదిలిపెట్టి జనం వెనుక, జనం ప్రక్కన,జనంతో నిలబడి పోరాడితే విభజన ప్రక్రియ ఆగిపోతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ను విభజించడం అబధ్దమని, దీనికై ఎంత వరకైనా పోరాడుతామని మిత్రా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more