వార్తలు ప్రచురించే పత్రికలు కొన్ని నిబంధనలను పాటించటం సమాజ శ్రేయస్సు దృష్ట్యా చాలా అవసరమని మన పత్రికలు పూర్వకాలంలో గుర్తించాయి, వాటికి కట్టుబడి ఉండేవి. కానీ రాను రాను జర్నలిజంలో దిగజారుడు రావటానికి కారణం వాటికి రాజకీయ పార్టీ నాయకుల సంపాదకత్వమే అన్నది రాష్ట్రమంతా ఎరిగిన సత్యం.
పూర్వకాలం వార్తలను కేవలం వార్తల్లాగానే రాసేవారు. ఎవరు అన్నారు, ఏమి అన్నారు, ఎక్కడ అన్నారు, వీలయితే ఏ సందర్భంలో అన్నారు- అంతే కానీ రాసినవారి సొంత వ్యాఖ్యానాలు కానీ ఇతర ముక్తాయింపు వాక్యాలు కానీ ఉండేవి కావు. ఊహాగానాలు అంతకంటే ఉండేవి కావు.
వార్తా పత్రిక మొత్తంలో సంపాదకుడికి స్వేచ్ఛ ఉండేది ఒకే ఒక్క చోట- అదే సంపాదకీయం. మిగతా వార్తలలో సంపాదకుల అభిప్రాయాలుండటం సరికాదు. టివి ఛానెల్స ఇన్ని రాకముందు దూరదర్శన్ లో వార్తలు చదివేటప్పుడు ముఖంలో హావభావాలను కూడా ప్రదర్శించేవారు కాదు. ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు 11 రోజులు దేశమంతటా సంతాపాన్ని ప్రకటించగా దూర్ దర్శన్ లో వార్తలు చదివే మహిళలు ఆ రోజుల్లో లిప్ స్టిక్ వేసుకోకుండా ముఖమంతా విషాదం చోటుచేసుకుని టివి కార్యక్రమాలను నిర్వహించటాన్ని పలువురు తప్పు పట్టారు.
కానీ ఈరోజు కొన్ని పత్రికలలో వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు ఎక్కువ, వార్తలు తక్కువగా కనిపిస్తాయి. తిరుపతిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మీద దాడి జరిగిందని, అందుకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంతవరకూ ఎటువంటి చర్యా తీసుకోలేదని తెలంగాణా ప్రజలకు ప్రముఖంగా వార్తా పత్రికలో తెలియజేయటంలో ఆ పేపర్ ఉద్దేశ్యమేమిటో దాన్ని నిర్వహిస్తున్నవారికే తెలియాలి. పైగా అది నిజం కూడా కాదు. కారు మీదకు చెప్పులు విసరటం సరికాదు నిజమే కానీ అది దాడి లోకి రాదు. దూరం నుంచి విసిరిన చెప్పు నిజంగా తగిలినా ప్రాణం పోదు కాబట్టి అది దాడి అనిపించుకోదు. అయినా రాత్రికి రాత్రి అరెస్ట్ లు జరిగాయి.
అయినా ఎవరూ ఒట్టిగానే నిరసన తెలియజేయరు. కారణముంటుంది. విహెచ్ అటువంటి పనికి ప్రేరేపించే వ్యాఖ్యలు చెయ్యటం కూడా మంచిది కాదు కదా. అయినా ఆ తర్వాత కూడా విహెచ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. అక్కడ ఆ సందర్భంలో అవసరంలోని మాటలు మాట్లాడారు. ఆంధ్రా ఉద్యోగులు హైద్రాబాద్ వదిలి పోవలసిందే అన్న మాట కేవలం తన వాహనాన్ని అడ్డుకునే సాహసం చేసిన ఉద్యమ కారుల మీద కచ్చగట్టి మాట్లాడిన మాటలే అవుతాయి.
అలాంటి దాడులు తెలంగాణాలో హైద్రాబాద్ లో లెక్కలేనన్ని జరిగాయి. అంటే దానికి బదులుగా తిరుపతిలో జరగవచ్చని కాదు. కానీ ప్రతి విషయాన్నీ రాజకీయం చెయ్యటం రాజకీయ నాయకులకు చెల్లుతుంది కానీ అదే దోవలో వార్తా పత్రికలు కూడా పోవటం సమాజానికి ఎంత మాత్రం మేలు చెయ్యదు.
వార్తంటే వార్తే కానీ వండి వార్చి వడ్డించే వంటకం కాదని, సత్యాలనైనా పరిస్థితులను గమనించి తెలియజేయవలసి ఉంటుందని తెలుసుకుని తదనుగుణంగా పత్రికలు మెలిగితేనే సమాజంలో సుస్థిర పరిస్థితులు ఏర్పడతాయన్నది అక్షర సత్యం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more