ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి నట సింహం బాలయ్య 2014లో ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో కి వచ్చి తన అద్రుష్టాన్ని పరిక్షించుకోవాలని అనుకుంటున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా మరి బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నాడు. చంద్రబాబు ఏ ఆయనకు ఎక్కడి నుండి టిక్కెట్ ఇవ్వబోతున్నాడు ? ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. మొదటి నుండి బాలయ్య టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయాలని తొలుత భావించారు. దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఇదే నియోజకవర్గంలో భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆ గ్రామం పామర్రు (ఎస్సీ) నియోజకవర్గంలో కలవడంతో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు తనకు సన్నిహితులైన వారితో సర్వేలు చేయించగా గుడివాడ నుంచి పోటీ చేయకపోవటమే మంచిదని తేలింది. దీంతో బాలయ్య గుడివాడ నుండి తప్పుకొని ఇప్పుడు మైలవరం పైన కన్నేశాడు. కానీ ఇప్పటికే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావు దీనికి ససేమిరా అనడంతో వీరిద్దరి వ్యవహారం పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతుంది.
చిలికి చిలికి గాలి వానగా తయారైన ఈ వ్యవహారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరికి చేరడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడని అంటున్నారు. ఈ పరిణామాలు రుచించని ఉమ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మైలవరం నుంచే పోటీచేస్తానని అధినేతకు స్పష్టం చేయగా, ఆయన నుంచి స్పందనలేదని, ఆ అంశంపై మళ్లీ మాట్లాడదామని అందరికీ చెప్పినట్లే ఉమకూ చెప్పి పంపినట్లు సమాచారం. కాగా, మైలవరం నుంచే తను పోటీకి వీలుగా ఉమను ఒప్పించే బాధ్యత మీదేనని బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబుకు తేల్చిచెప్పినట్లు తెలిసింది. చూద్దాం ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more