Minister danam nagendar fires on kcr

danam nagendar fires on kcr, seemandhra staff must go, says kcr, kcr vs andhra staff, seemandhra govt staff will have to leave telangana, kcr asks andhra staff to leave telangana, breaking news, ap politics, political news, andhra news

Minister Danam Nagendar fires on KCR, Seemandhra staff must go, Seemandhra govt staff will have to leave Telangana

తెలుసుకో..కేసిఆర్ ? ముందు నవ్వు వెళ్లాలి?

Posted: 08/03/2013 11:39 AM IST
Minister danam nagendar fires on kcr

తెలంగాణా ప్రాంతం నుంచి కెసిఆర్‌ అనే కోస్తాంధ్ర ‘బొబ్బిలిదొర’ వేలకోట్లకు అధిపతిగా ఉంటూ, నిరంకుశ నిజాం పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజల్ని దోచుకుతింటూ వచ్చిన ‘దొరల’సామ్రాజ్యాన్ని మరొకసారి తెలంగాణాలో నెలకొల్పడానికి రాజకీయ నిరుద్యోగి హోదాలో రంగప్రవేశం చేశాడు. విచిత్రమేమంటే తెలంగాణాలో తన స్వార్ధ రాజకీయాలకోసం, ముఖ్యమంత్రి పదవికోసం మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిలాగానే తెలుగు జాతి ఐక్యతను గండికొట్టడానికి టి.ఆర్‌.ఎస్‌. పార్టీని పెట్టడం! అంతకన్నా సిగ్గుచేటైన వ్యవహారం నేటి తెలంగాణా ప్రాంతంలో పెద్ద వలసదారుగా ప్రవేశించిన కె.సి.ఆర్‌ ఇటీవల టి.ఆర్‌.ఎస్‌. పార్టీలో చేరిన స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు కె.కేశవరావు కూడా సీమాంధ్రులే కావటం! కేశవరావు మచిలీపట్నంవాడు, కె.సి.ఆర్‌. ఉత్తారాంధ్ర వాడూ! కొడుకు రామారావు శ్రీకాకుళం జిల్లాలోని ‘బ్లూచిప్స్‌’అనే విలువైన రంగురాళ్ల ఎగుమతి వ్యాపారంచేస్తూ కోట్లాది రూపాయల ఆస్తుల్ని కూడబెట్టుకున్నవాడూ!

  

కొండా లక్ష్మణ్‌ బాపూజీ మచిలీపట్నంవారి అల్లుడూ! ఇతని బాగోతాన్ని తెలంగాణాలోని సోషలిస్టు నాయకుడు, స్వాతంత్య్రయోధుడూ, త్యాగశీలీ అయిన నర్రా మాధవరావును కదిలిస్తే ఎన్ని ‘రహస్యాలు’బయట పడతాయో చెప్పలేము! అందుకే ఈ బాపూజీ ఆయన ఎదుట పడడూ! వాదించేవాడు కాదు! అంటే, ప్రత్యేక తెలంగాణా ఉద్యమంపేరిట ప్రధానంగా ఆది నుంచి సాగుతూవచ్చిన ‘డ్రామా’అంతా దోపిడీ, దౌర్జన్యాలకు నిజాంపాలనలో అలవాటుపడిన దొరల స్వామ్యానికీ, రెడ్లు స్వామ్యానికీ మధ్య అధికారంకోసం సాగుతూవచ్చిన వెంపరలాటలూ, సోటా పోటీలే తెలంగాణా ప్రజాబాహుళ్యం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మూల్గుల్ని పీల్చుచూ జనాల్ని ‘నీబాన్చను దొరా’అంటూ బతుకులీడ్చే దొరణ స్థితికిదించారు!

  

అందుకే అధికారంకోసం డాక్టర్‌ చెన్నారెడ్డి, అతడి మేనమామ రంగారెడ్డి కూడా విశాలాంధ్ర నిర్మాణాన్ని ఆదిలోనే అడ్డుకోడానికి అసలు కారణం. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగానే చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి మరొకసారి దక్కనందుకు ‘ప్రజా సమితి’ పేరిట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని లేవదీసి కొంతమంది యువకుల ప్రాణం తీశాడు. ప్రధానమంత్రి హోదాలో ఇందీరాగాంధి ‘చలవవల్ల’ ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా ఉద్యోగం రావడంతోనే ‘ప్రజాసమితి’ పార్టీని మూసీనదిలో కలిపేశాడు! అలాంటి తతంగాన్నే ఇటీవల ‘దొర’ కె.సి.ఆర్‌. కూడా ప్రారంభించి, సెలైన్‌ సత్యాగ్రహం నాటకం ద్వారా ‘ప్రత్యేక తెలంగాణా’ ఉద్యమాన్ని చేపట్టి, బూతులతో బెదిరింపులతో కొసాగిస్తూ, ప్రాంతం యువకులలో లేని ఉపాధిపట్ల ఆశలు గొల్పి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టించడమేగాక దాదాపు వెయ్యి మంది యువకులను ఆత్మహత్యలకు కారణమయ్యడు. ఇందుకోసం చివరికి చేసిన పనేమిటి? తన కుటుంబ సభ్యులు ఎవరూ చావకుండా సరాసరి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో, అవకాశవాదులయిన స్థానిక కాంగ్రెస్‌ నాయకుల రాయబారాల ద్వారా మంతనాలకు దారి పరుచుకొని, తనను బతికించడం కోసం, లేదా ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకపోతే స్థానికంగా తనను ప్రజలు బతకనివ్వరని చెప్పించుకోవలసి వచ్చింది.

 

 

దీని పర్యవసానంగా తెలంగాణా ప్రజలకు ఒరిగిందేమిటి? తెలంగాణాలో అధికారం నిలబెట్టుకోడానికిగాను కాంగ్రెస్‌ అధిష్ఠానం ‘‘ముందు టి.ఆర్‌.ఎస్‌. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తాన’’ని ప్రజాభిప్రాయంతో నిమిత్తంలేకుండా కె.సి.ఆర్‌కు మాటిచ్చింది! తెలంగాణా ప్రజల మధ్య తన పరువు పోకుండా ఉండడంకోసం కెసిఆర్‌ ‘‘సర్‌, కాంగ్రెస్‌లో టి.ఆర్‌.ఎస్‌.ను కలిపేస్తాను’’అని ఢిల్లీలో ఒప్పందమై వచ్చాడు. ఇక ప్రస్తుతం పరిణామాలకు వస్తే, ‘‘ప్రత్యేక రాష్ట్రాం ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్‌ తీర్మానం చేసింది గదా, అయితే వెంటనే టి.ఆర్‌.ఎస్‌.ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తావా, లేదా’’ అని దిగ్విజయ్‌సింగ్‌ ‘బొబ్బిలిదొర’’ కెసిఆర్‌ను ఇప్పుడు ఎదురు ప్రశ్నిస్తున్నాడు! కాని పార్లమెంటులో బిల్లుపెట్టి, ఆమోదింపజేసేదాకా కాంగ్రెస్‌లో టి.ఆర్‌.ఎస్‌.ను కలపను, వేచిచూస్తానని కాంగ్రెస్‌కు ఏకుమేకయ్యాడు! కాని ఇదంతా అతను ఎందుకు చేస్తున్నట్టు? దాదాపు వెయ్యిమంది కుర్రాళ్ల ప్రాణాలను తాను తీశాడు కాబట్టి ఆ నేరస్థ మనస్తత్వం అతడినే వెంటాడుతున్నందున అలా బింకాలుపోతున్నాడు కెసిఆర్‌!!

  

తాజాగా కేసిఆర్ చేసిన విచిత్రమైన కామెంట్ తో తనలోని విక్రుత రూపాన్ని బయటపెట్టాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తన సమ్మతిని వెల్లడించిన సందర్భంగా నిన్న తెలంగాణా భవన్ లో కెసిఆర్ ని అభినందించటానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ఉద్యమకారులను రెచ్చగొట్టాయి. ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెళ్లవలసి వస్తే ముందుగా కేసీఆరే హైదరాబాద్ ను విడిచి వెళ్లాలని ఆయన అన్నారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాల ప్రజల వారు నివసిస్తున్నారని, స్వార్థ రాజకీయాల కోసం సెటిలర్ల జీవితాలతో ఆటలాడుకోవద్దని దానం కేసీఆర్ కు హితవు పలికారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకుంటే హైదరాబాద్ పై పునరాలోచిస్తామని దానం అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని ఆయన తెలిపారు.

 

 

విజయనగరం నుంచి వచ్చిన కేసీఆర్ వలసవాది అని దానం వ్యాఖ్యానించారు. తెలంగాణ రావటం కేసీఆర్ కు ఇష్టం లేకే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన ఘటన కాంగ్రెస్ కు దక్కటంతో ఆయన సహించలేకపోతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ మాటలతో సెగతో రగిలిపోతున్న సమైక్యాంద్ర వాదులకు ఆజ్యంపోసినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more