కాంగ్రెస్ అధిష్టానం చేసిన తెలంగాణ రాష్ట్ర విభజన సెగ సీమాంధ్రులకే కాకుండా ఆయా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న దేవుళ్ళకు కూడా తాకింది. మరో కొన్ని నెలల్లో రాష్ట్రం రెండుగా చీలిపోవడం ఖాయం అనే మాట బలంగా వినిపించడమే కాకుండా దానికి సంబంధించిన ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. కలియుగ రాముడిగా పేరొందిన భధ్రాచలం రాముడు ఇప్పుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వాడని ఇక్కడి వారు అంటుంటే... 1956కు పూర్వం భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నందున తమకే కేటాయించాలని కోస్తా ప్రజలు కొత్త డిమాండ్ ను తెర పైకి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భద్రాద్రి రాముడి చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే అది ముమ్మాటికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లాకే చెందుతుందని తెలుస్తుంది. కీ.శ 591లో ఖమ్మం ప్రాం తాన్ని మహదేవవర్మ అనేరాజు పరిపాలించాడు. అతని 9 వ వంశస్థుడైన మహదేవరాజు 10శతాబ్దంలో రాజ్యపాల న చేశాడు. అప్పట్లోనే ఓరుగల్లుకు చెందిన రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి అనే ముగ్గురు గుప్తనిధులు తెచ్చి ఖ మ్మం ఖిల్లాను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతర కాలంలో గోల్కొండ నవాబులు పరిపాలించారు. తరువాత నైజం పాలనలో రావటంతో పరిపాలన సౌలభ్యం కోసం 21 సర్కారులను 40 సర్కారులుగా విభజించాడు. వాటిలో ఖమ్మం, వరంగల్ సర్కారులు ఉన్నాయి.
1905 లో నైజాం కాలంలోనే తిరిగి తన రాజ్యాన్ని పునర్విభజన చేశాడు.ఈక్రమంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలను కలిపి సుభా ఏర్పాటు చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరి గింది. దీంతో జిల్లాల పునర్విభజన జరిగింది. అప్పటివర కు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నూగూరు, భద్రాచలం తాలుకాలను ఖమ్మంజిల్లాలో కలిపారు. పూర్వ పరాలు ఎలా ఉన్నా ఇప్పుడు చారిత్రక పరంగా, రెవిన్యూ రికార్డ్స్ పరంగా భద్రాద్రి రాముడు తెలంగాణ జిల్లాకు చెందినవాడే అవుతాడు. అయినా రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన దేవుళ్ళను విడదీయాల్సిన అవసరం లేదు. దక్షిణభారత అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకునే హక్కు అందరిదీ. ఇందులో ఎవరికీ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more