Telangana war update news in delhi

telangana war update news in delhi, congress meeting on telangana in delhi, telangana war, cwc to take decision on telangana, digvijay singh, telangana hot politics in delhi, telangana, latest news on telangana, telangana issue, decision on telangana soon, ap cm meets cabinet prior delhi visit , breaking news, ap politics, political news, andhra news

telangana war update news in delhi, War of notes over Telangana, Congress meeting on Telangana in Delhi

ఢిల్లీలో జరుగుతున్న టీ-అప్ డేట్స్

Posted: 07/26/2013 01:20 PM IST
Telangana war update news in delhi

ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ పై కాంగ్రెస్ కోర్ కమిటి పైనే రాజకీయ నాయకుల ద్రుష్టి. తెలంగాణ వ్యవహారం ఢిల్లీలో హాట్ హాట్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణా విషయం ఏమో జరుగుతుందో అని ప్రజలు, రాజకీయ నాయకులు, రాజకీయ మేథావులు, అందరి చూపు ఢిల్లీ మీద ఉంది. ఇక లోకల్ మీడియా, నేషనల్ మీడియా కూడా తెలంగాణ విషయం మీదనే ఫోకస్ పెట్టింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీమాంద్ర నేతలు ఢిల్లీ పెద్దల భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరరావు న్యూఢిల్లీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర అధిష్ఠానం నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆ నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరు ఆరగంటపాటు భేటీ అయ్యారు. మరోవైపు సమైక్యాంధ్ర కోసం ఆ ప్రాంతానికి చెందిన ఎంపీలు, మంత్రులు, నాయకులంతా సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో న్యూఢిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే.

తాజాగా సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎపి భవన్ లో సమావేశం అయ్యారు. దీనికి కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, జెడి శీలం, చిరంజీవి, పురందేశ్వరి తదితరులతో సహా రాష్ట్రానికి చెందిన మంత్రులు పలువురు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో వీరు భేటీ అయి సోనియాగాంధీకి వినతిపత్రం ఇవ్వటానికి సిద్దమైనట్లు సమాచారం. అందులో కాంగ్రెస్ బలం, ఆంద్రలో పరిస్థితులు అన్నింటిని వివరించారు. తాము మరోసారి గట్టిగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరతామని అంటున్నారు. మంత్రి రామచంద్రయ్య దీనిపై మాట్లాడుతూ ఏ విధగా హైకమాండ్ ను ఎలా ఒప్పించాలో, ఒత్తిడి పెంచాలో ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే దేశానికి ఎంత ప్రమాదం వస్తుందో చెప్పదలిచామని ఆయన అన్నారు.

ఇక ఈ భేటి అనంతరం కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందట ఏపీ భవన్ లో సమావేశమైన మంత్రులు రాష్ట్ర విభజన అంశంపై సీఎంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ నివేదకను అందజేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదని, స్థానిక ఎన్నికలు అయ్యే వరకు ఆగాలని నివేదికలో సూచించారు.

కాంగ్రెస్ వార్ రూంకు నేతలు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులు చేరుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని 15, గురుద్వారా రకబ్ గంజ్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ వార్ రూములో రాష్ట్ర నేతలు సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ బొత్సతో పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో దిగ్విజయ్, గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. మరోవైపు ఏపీ భవన్ లో సీమాంధ్ర ప్రాంత నేతల సమావేశం జరుగుతోంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more