తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుపై ఆ పార్టీ ఎంపీ విజయశాంతి ధిక్కార స్వరం వినిపించేట్లుగా కనిపిస్తోంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుండి 2014 ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న సందర్భంలో మెదక్ ఎంపీ సీటు చాక్లెట్ కాదని, ఎవరి కోసమో దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆమె విస్పష్టంగా ప్రకటించారు. తన సీటు మారుస్తారంటూ వస్తున్న వదంతులపై పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని లేదంటే, అది పార్టీకే నష్టమంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ సీటు కేటాయించకుంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆమె మనసులో మాట బయట పెట్టారు. సమయం వచ్చినప్పుడే టిక్కెట్ రాకుంటే ఏం చేస్తానో సమాధానం చెబుతానని ఆమె కుండబద్దలు కొట్టారు. మెదక్ ప్రజల నుండి తనను ఎవరూ వేరుచేయలేరన్నారు. తన నియోజకవర్గాన్ని మార్చి మరో నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే విషయంపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎప్పుడూ తనతో మాట్లాడలేదని ఆమె చెప్పారు.
ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించాలే తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఆమె కేసీఆర్కు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆమె మనసులో ఉన్న మరో మాట బయటపడింది. తెరాస తనకు టిక్కెట్ కేటాయించకున్నా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేందుకైనా సిద్ధమని సంకేతమిచ్చారు. ఆ పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీ పార్టీలో ఉన్న సమయం లో తనను సొంతబిడ్డలా చూసుకున్నారని అన్నా రు. ఇదిలావుండగా, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన మెదక్ నుండి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. అయితే విజయశాంతికి మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. విజయశాంతి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడంతో మెదక్ తెరాస ఎంపీ టిక్కెట్ విషయంలో గందరగోళం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయశాంతి తనకు మెదక్ టిక్కెట్ కేటాయించకపోతే బిజేపిలో చేరి మెదక్ నుండే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బిజేపి నుండి కూడా స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more