ఆ ఇద్దరిలో అసలు బాస్ ఎవరు అనే విషయం పై గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. దేశానికి ఇద్దరు అధినేతలు ఉన్నారని వారిలో ఎవరు కచ్చిత మైన వారో తెలియడం లేదని నరేంద్ర మోడీ పంజాబ్లోని మాధోపూర్లోజరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. అలాగే కాశ్మీరీల గాయాలు మానేలా చూసి అక్కడి యువతను రాష్ట్ట్ర అభివృద్ధి స్రవంతిలో భాగస్తులను చేయాలని కోరారు. 2014 ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రచార కార్యక్రమ సారథిగా మొదటి సారి ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు. జన సంఘ్ వ్యవ స్థాపకుల్లో ఒకరైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 60వ వర్ధంతిని పురస్కరించు కుని ఆయన స్వంత గ్రామమైన మాధోపూర్లో ఈ ర్యాలీ నిర్వహిం చారు. నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలపై విమర్శలు గుప్పించారు. 'దేశానికి ఇద్దరు యజమానులు ఉన్నారు, వారిద్దరిలో ఎవరు అసలైన వారో తెలియటం లేదు' అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఒకే వ్యవస్థలో ఇద్దరు అధినేతలుండే విధానానికి వ్యతిరేకంగా ముఖర్జీ చేసిన నినాదాన్ని ఉటంకించారు. 2014 ఎన్నికలకు పార్టీ ప్రచారాన్ని ఆయన ప్రారంభిస్తూ, 'కాశ్మీరీల గాయాలు మానేలా చూడాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ట్ర యువకు లను ప్రధాన జాతీయ జీవన స్రవంతిలో భాగ స్తులను చేసి రాష్ట్రాభివృద్ధికి వారు కృషి చేసేందు కు తోడ్పడాలని పిలుపునిచ్చారు. అక్కడి యువ కులు రాష్ట్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని భావిస్తున్నారని అన్నారు. 'తుపాకులు రక్తాన్ని చిందిస్తాయి తప్ప. ఎవరి జీవితానికి ఎటువంటి మంచినీ చేకూర్చవు' అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కాశ్మీర్ విధానాన్ని ఆయన విమర్శించారు. ఆ విధానం అమలులో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని తెలి పారు.యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి కల్పన వాజ్పేయి హయాంలో జరిగిన దానితో పోలిస్తే సగమేనని అన్నారు. రూపాయి విలువ పడిపోవడం గురించి ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పతనం విషయంలో రూపాయితో పోటీ పడుతు న్నదని అన్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరుతూ 'వారి చేతుల్లో మీ భవిష్యత్తు క్షేమంగా లేదు... మన యువత భవిష్యత్త్తుతో మనం ఆడుకోలేము' అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more