వాళ్లు అధికారంలోకి రావటానికి నన్నుచంపేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి పై ఆ పార్టీ నాయకులు పగ బట్టి ఉన్నారని సీఎం అన్నారు. అయితే ముఖ్యమంత్రి కి నిజంగానే ప్రాణాహాని ఉందా? అదీ కూడా మావోయిస్టుల చేతిలో ప్రాణాహాని ఉందని సీఎం అంటున్నారు. ఇప్పటికే నా పై అనేక సార్లు రెక్కీ నిర్వహించినట్లు ముఖ్య మంత్రి చెబుతున్నారు. అసలు ముఖ్యమంత్రి కి మావోయిస్టులకు ఏమిటి సంబంధం ? వారు ఈ ముఖ్యమంత్రి నే ఎందుకు టార్గెస్ చేశారు? అంటే వారికి వెనుక ఒక రాజకీయ పార్టీ ఉందని సీఎం మీడియా కు చెబుతున్నారు. ప్రాణ భయం ఉన్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి కాదులేండి. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాహాని ఉందని మీడియా ముందు వాపోతుంది. అటు కేంద్రంలోనూ, ఇటు మీడియాలోని ఓ వర్గంలోనూ ఉన్న ప్రతికూలశక్తులు కొన్ని తనను మట్టుపెట్టడానికైనా వెనుకాడడం లేదని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆవేదన వెళ్లగక్కారు. కోల్కతాకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గైగట్టా ప్రాంతంలో ఆమె పంచాయితీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రాన్ని, కేంద్రప్రభుత్వ సంస్ధల తీరుతెన్నుల్నీ, మీడియాలోని ఓ వర్గాన్ని ఆమె ఘాటైన పదజాలంతో దుయ్యబట్టారు. ఈ ఆరోపణల్లో సీపిఐ(ఎం), మావోయిస్టుల్ని కూడా ఆమె వదిలిపెట్టలేదు. కేంద్రప్రభుత్వం, ప్రభుత్వసంస్ధలు తనను చంపేందుకు కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపించారు.
ఈ కుట్రకు సంబంధించిన పోలీసుల ద్వారా తెలిసిన విశ్వసనీయ సమాచారం తన వద్ద ఉందని ఆమె అన్నారు. సీపిఐ(ఎం), కాంగ్రెస్, మావోయిస్ట్లు ఈ మేరకు తనపై కుట్రపన్నుతున్నారన్నారు. రెండ్రోజుల క్రితం బరాసత్ రేప్ బాధితురాలి కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు కాందుని గ్రామంలోనికి వెళ్లిన సందర్భంలో ఈ కుట్ర సమాచారం బహిర్గతమైందని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ రోజు నా చుట్టూ పోలీసులు చేరకుండా నన్ను దిగ్బంధించాలని ఓ జర్నలిస్టు సీపీఎం కార్యకర్తలను ఉసిగొల్పాడు.. ఈ కుట్ర గురించి నా భద్రతాధికారులు తర్వాత చెప్పారు. నాకేం భయం లేదు. సీపీఎం తిరిగి అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు చావంటే భయం లేదని, మా, మాటీ, మనుష్ (తల్లి, నేల, ప్రజలు) తన వెంట ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. అత్యాచారాలపై బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్లు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతీకార రాజకీయాల్లో తనకు నమ్మకం లేదని, తాను ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తానని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్క నెత్తుటి బొట్టు కూడా చిందలేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more