తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రధాన పోటీగా బీజేపి పావులు కదుపుతుంది. టీఆర్ఎస్ నుండి అధికసంఖ్య నాయకులు బిజేపిలోకి చేరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ గురైన రఘునందన్ రావు కూడా బీజేపి తీర్థంపుచ్చుకోవటానికి సిద్దమయ్యాడు. తెలంగాణ కు ప్రధాన శత్రవు టిఆర్ఎస్ పార్టీ అని బిజేపి కొత్త నినాదాం తెలంగాణ ప్రజల్లోకి తీసుకుపోతుంది. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు చేసిన తెలంగాణ రాకపోవటానికి కారణం టిఆర్ఎస్ పార్టీ అని బీజిపి నాయకులు అంటున్నారు. ప్రకటించిన తెలంగాణను వెనక్కు తీసుకున్న కాంగ్రెస్ను, ఉద్యమాన్ని ఎన్నికలకు ముడిపెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితిని తరిమి కొడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సునాయాసంగా ఏర్పడుతుందని పలువురు సీనియర్ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మోడీ ప్రభంజనంతో కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డిఎ ప్రభుత్వం క్షణకాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని జి కిషన్రెడ్డి చెప్పగా, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలను గెలుచుకున్నా తెలంగాణ ఎట్లా తెస్తావని టిఆర్ఎస్ నేత కెసిఆర్ను నిలదీయాలని నాగం జనార్దన్రెడ్డి తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు.
పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్రావు, ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రేమేందర్రెడ్డి వేదికను పంచుకున్న ఈ సభలో రఘునందన్రావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వెంటనే ఆయన సభ్యత్వ నమోదు రసీదునందుకున్నారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎన్డిఎ, రాష్ట్రంలో బిజెపి ప్రభంజనం వీస్తోందని, పార్టీలో తాజాగా చేరిన కార్యకర్తలు బిజెపి సిద్దాంతాలను పుణికి పుచ్చుకుని సాగాలని సూచించారు. నాగం మాట్లాడుతూ, విత్తంతో అధికారాన్ని పొందాలని చూస్తున్న పార్టీలకు తెలంగాణ వాదంలో ఉన్న పసను చాటి తడాఖా చూపించాలని కార్యకర్తలను కోరారు.తెలంగాణ కాంగ్రెస్ మీడియా ప్రతినిధులు కొత్త నాటకానికి తెర తీశారని, తెలంగాణ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటనలు చేస్తున్నారని, తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నిర్వహిస్తున్న పదవులకు స్వస్తి చెప్పి ఉద్యమించవచ్చుకదా అని నాగం ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more