తెలంగాణను వెంటనే ప్రకటించాలన్న డిమాండ్తో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాలు సేకరిస్తున్న మంత్రి జానారెడ్డి, శాసససభ్యుడు ఆర్. దామోదర్రెడ్డి మధ్య శాసనసభ లాబీలలో సంవాదం జరిగింది. ముఖ్యమంత్రి పదవి కోసమో, హోం పోర్ట్పోలియో కోసమో తెలంగాణ అంశాన్ని వాడుకునేందుకు సంతకాలు సేకరిస్తున్నారన్న అంశంపై వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది. తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన టి నేతల సమావేశంలో చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి పంపేందుకు శాసనసభ్యుల సంతకాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సంతకం చేయాల్సిందిగా దామోదర్రెడ్డిని జానారెడ్డి కోరారు. సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నారో తనకు తెలుసునని, ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించనంటూ దామోదర్రెడ్డి ఆవేశంగా అన్నారు. దీంతో ఖంగుతిన్న జానారెడ్డి ఏం మాట్లాడాలో అర్థం కాక తెల్లబోయారు.
టి ఎంపీలు, ఎమ్మెల్యేల అభిష్టం మేరకే అధిష్టానానికి తీర్మానం పంపిస్తున్నామని, తెలంగాణ కోసమే అందరి మద్ధతు కోరుతున్నానని జానా స్పష్టం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేపడితే తాను సంతకం చేస్తానని దామోదర్రెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరి మద్య సంవాదం ముదరడంతో ఆ పక్కనే ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులు వారిద్దరికి సర్ధి చెప్పారు. వ్యక్తిగత లబ్ధి కోసమే సమావేశాలను ఏర్పాటు చేసి సంతకాలు సేకరిస్తున్నారని దామోదర్రెడ్డి ఆ తర్వాత మాట్లాడుతూ జానాపై మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో సోనియాగాంధీతో జానా జరిపిన చర్చల వివరాలు పార్టీ నేతలకు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి సమావేశాలకు రాని వారంతా నాటి సమావేశానికి ఎందుకు వచ్చారని ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 30 వ తేదీన బహిరంగ సభ నిర్వహించి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తాను కూడా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని దామోదర్రెడ్డి సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more