పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తన అసలు మళ్లీ ప్రజలకు చూపించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రజలపై నోరు పారేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బర్ సత్ లోని కామ్దూని గ్రామంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్యచేసిన విషయం తెలిసిందే. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతాబెనర్జీ కామ్దూని గ్రామం వెళ్లారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన మమత ''మీకు సిగ్గు లేదా..? మీరంతా రాజకీయాలు చేస్తున్నారు. ఈ హత్య చేసింది సిపిఎం కార్యకర్తలే'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా బెంగాల్ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
పరిస్థితి చేయి దాటిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేరుగా మమత ఘటనా స్థలానికి వెళ్లారు. ఆమె రాకపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. 'ఘటన జరిగిన పది రోజుల తరువాత గ్రామం గుర్తుకొచ్చిందా?' అంటూ బెంగాల్ సిఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. ఈ పరిణామానికి బిత్తరపోయిన మమత.. తన ఆవేశాన్ని సిపిఎంపై వెళ్లగక్కారు. ఈ అత్యాచారం, హత్య చేసింది సిపిఎం కార్యకర్తలేనని తీవ్ర ఆరోపణ చేశారు. 'మీరు కూడా సిపిఎం రాజకీయాలు చేస్తున్నారు. మీకు సిగ్గులేదా..?' అంటూ ప్రజలను తీవ్రంగా దూషించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more