ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గంలోని మంత్రి అయిన డి.ఎల్ రవీంద్రారెడ్డిని తొలగించడంతో మనస్తాపానికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తలు రాజకీయ వర్గాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీలో చేరబోతున్నాడు ? అంటే రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈయన తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈయన వ్యతిరేకం కావడం, ఇటీవలే కడప జిల్లాకు చెందిన ముఖ్యనేత మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడటంతో ఆ పార్టీకి బలమైన నాయకుడు లేకుండా పోయాడు. దీంతో ఈ లోటును పూడ్చడానికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. ఈ వార్తలను ఆయన గతంలో ఖండించినా, ఈ మధ్య కాలంలో స్పందించక పోగ, నిన్న మాట మార్చారు. కాంగ్రెసులో ఉండాలా, వద్దా అనే విషయంపై శానససభా సమావేశాలు ముగిసిన తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
ఇక ఈయన పై వేటు పడటంతోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునుతో రహస్య మంతనాలు కూడా జరిపాడని , ఇందుకు సంబంధించి ఆయన నుండి సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు. తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి బుథవారం తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఇక మైసూరా వెళ్ళడంతో ఆ పార్టీకి బలమైన నాయకుడు కావాలి కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా డీఎల్ ని పార్టీలోకి ఆహ్వానించడానికి అధినేతతో మంతనాలు జరుపుతున్నారట. ఇక డీఎల్ కూడా ఈ పార్టీలో చేరితే ఇటు మైసూరా సీటును ఆశించడంతో పాటు ఆయన కేడర్ ను కూడా తన దారిలోకి తెచ్చుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సునాయసంగా దక్కుతుందని భావిస్తున్నాడట. ఏది ఏమైనా డీఎల్ ఈ నెలఖరులోగా పార్టీ మారడం ఖాయం అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more