వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా పేరు తెచ్చుకొని, ఆయన మరణం తరువాత మంత్రి పదవిని సైతం వదులుకొని జగన్ పార్టీలో చేరి వరంగల్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలుగా ఉంటూ వస్తున్న కొండా సురేఖ దంపతులకు, వారి వర్గానికి చెందిన నలుగురి పై వేటు వేడయంతో జీర్ణించుకోలేక పోయిన వారు,పార్టీ మారి, బీజేపీలోకి వెళుతున్నట్లు ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే వారి మధ్య తలెత్తిన వివాదాలు సమసి పోయి, ఓ మెట్టు దిగి రాజీకి వచ్చినట్లు తెలుస్తుంది. కొండా దంపతులు నిన్న సాయంత్రం వైయస్సార్ కాంగ్రెస్ శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్యవర్తిత్వంతో వైయస్ విజయమ్మతో భేటి అయ్యారు. దాదాపు 40 నిమిషాల పైగా సాగిన ఈ భేటి లో పార్టీలో తమను అవమానిస్తున్న తీరును వారు ఆమెకు వివరించారు. తమ వర్గానికి చెందిన నలుగురిపై తమకు చెప్పకుండా వేటు వేయడాన్ని కూడా వారు ప్రశ్నించినట్లు చెబుతున్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోతే ఉండబోమని వారు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.
పార్టీలో తమకు అవమానం జరుగుతోందని వారు చెప్పినప్పుడు ఆ విషయాలు తమకు తెలియవని విజయమ్మ అన్నట్లు తెలుస్తోంది. తాము చెప్పినా పట్టించుకోలేదనే విషయాన్ని వారు గుర్తు చేసినట్లు చెబుతున్నారు. జగన్తో భేటీ తర్వాత తాము వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. తమకు పార్టీపై అసంతృప్తి లేదని, వరంగల్ జిల్లాలోని కొన్ని పరిణామాల వల్ల తాము బాధపడ్డామని కొండా సురేఖ చెప్పారు. పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిపై పార్టీ అధినేత నుంచి స్పష్టత వచ్చేంత వరకు మీడియా ముందుకు రావద్దని అనుకున్నామని ఆమె చెప్పారు. ఇప్పటికే వీరికి పలు పార్టీల నుండి ఆఫర్లు రావడంతో అలర్ట్ అయిన జగన్ వీరితో మాట్లాడి పార్టీ నుండి పోకుండా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లేనని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్లే అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more