వ్యాపార దక్షతను పెంచటానికి స్వయం ఉపాధి మహిళలకు చేయూతనిస్తామంటున్నారు ముఖ్యమంత్రి.నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మ హస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, స్వయం ఉపాధితో వ్యాపారంలో పుంజుకోవటానికి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు. స్వయం ఉపాధి మహిళా సంఘాలకు 30 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించటం జరుగుతుందని ఆయన వాగ్దానం చేసారు. తెలుగు దేశం పార్టీ హయాంలో కేటాయించిన 36 కోట్ల రూపాయలతో పోలుస్తూ కిరణ్ కుమార్ రెడ్డి, తన హయాంలో మైనారిటీస్ కి 1027 కోట్ల రూపాయలను కేటాయించారని అన్నారు. అలాగే, 13000 కోట్ల రూపాయలను వడ్డీ లేని ఋణాలుగా స్వయం ఉపాధి మహిళా సంఘాలకు ఇవ్వటానికి నిధులను కేటాయించామని కూడా కిరణ్ కుమార్ తెలియజేసారు. ముందు ముందు మహిళలు స్థానిక, మున్సిపల్ పాలక యంత్రాంగంలో 50 శాతం స్థానాలను అలంకరిస్తారని కూడా ఆయన అన్నారు.
ఎన్నికల లోపులో మహిళలకు మూడోవంతు స్థానాన్ని పార్లమెంటు కలుగజేసే దిశగా చట్టం కూడా రాబోతున్నదని ప్రకటించి తేలిపోయారాయన!
పథకాలు కానీ, వాగ్దానాలు కానీ, విమర్శలు కానీ సంవత్సరకాలం నుంచి రాబోయే ఎన్నికల దృష్టిలోనే జరుగుతున్నా, ఎన్నికల కమిషన్ ఏ పార్టీనీ ప్రస్తుతం తప్పుపట్టే అధికారంలో లేదు. ఎన్నికల నిబంధనలకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ ప్రస్తుతం మిన్నకుండాల్సిందే. చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలకు ఇంత సుదీర్ఘమైన ప్రచారాలు జరగటం మనదేశంలోనే కాదు ఎక్కడా జరగలేదు. ప్రతి అడుగూ జాగ్రత్తగా వెయ్యటం, ప్రతి మాటా ఆచి తూచి మాట్లాడటం, ప్రతి నిర్ణయాన్ని ఎన్నికల దృష్టిలోనే తీసుకోవటం అంటే, స్కూల్ లో చేరిన మొదటి రోజు నుంచే సంవత్సరాంతంలో జరిగే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజూ చదువు సాగించినట్లే.
తెలియకుండానే ప్రజలకు మంచి చేసేస్తారేమో. ఇదీ మంచికేనేమో చూద్దాం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more