బట్టతల వలన సమస్యేమిటంటే, ముఖం ఎక్కడివరకు కడుక్కోవాలో అర్థం కావటంలేదన్నాడో పెద్దమనిషి.
గనుల తవ్వకాలను అక్రమంగా నిర్వహించి భారీగా సొమ్ము చేసుకోవటమే కాదు గాలి జనార్దన రెడ్డి ఎల్లలను తుడిచేసిన ఘనతను కూడా కొట్టేసారు. గాలి జనార్దనరెడ్డి సోదరులకు చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కార్యకలాపాలలో ఆంధ్ర కర్నాటక సరిహద్దులలో చేసిన తవ్వకాల వలన ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దన్నది తెలియకుండా పోయింది.
ఆ సరిహద్దులు ఇదమిద్ధంగా తేలేవరకు ఓబుళాపురం మైనింగ్ కార్యకలాపాలను జరపవద్దని, అంతవరకు తవ్వకాలను రద్దు చేయటమైనదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల బృందం, ఓఎమ్ సి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులనైతే దాటి పోయిందన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా నిర్ధారించారు. మైన్స్, జియాలాజికల్ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రికార్డ్ లు, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలు ఇచ్చిన డ్రాయింగ్ ల ప్రకారం రెడ్డి సోదరుల ఓబుళాపురం మైనింగ్ వారికి కేటాయించిన 68.5 హెక్టార్లు, 39.5 హెక్టార్ల భూమికంటే ఎక్కువ భూభాగంలో మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించి కర్నాటక సరిహద్దుని దాటి పోయారని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు ఆ కంపెనీ కార్యక్రమాల అనుమతిని రద్దు చేసింది.
నిపుణుల బృందం ఇచ్చిన నివేదికలో, రెడ్డి బ్రదర్స్ ఎంత వరకు అనుమతిని మించి ఆక్రమించుకున్నారన్నది తేలటానికి సమయం పడుతుంది కాబట్టి ఈ లోపులో వాళ్ళ కార్యక్రమాలను నిలిపివేయవలసిందిగా సూచించారు. ఫిబ్రవరి 22 నుండి తాత్కాలికంగా నిలిపివేసిన తవ్వకాల వలన ఇప్పిటికే చాలా ఆర్థిక లావాదేవీల్లో, ఐరన్ ఓర్ ఎగుమతుల ఒప్పందాలలోనూ వెనకబడివున్న ఓఎమ్ సి కి సుప్రీం కోర్టు ఆదేశాలు పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more