ఉద్యోగులు ఒక్కరోజు పనిచెయ్యకపోతే వాళ్ళ వేతనంలో కటింగ్ పడుతుంది. కానీ నాయకులకు అలాంటి భయమేమీ లేదు.
సమావేశాల్లో పాల్గొనటానికి రాహుల్ గాంధీ తదితరుల పిలుపు మీద ఢిల్లీకి విడివిడిగా వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిపి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ అక్కడ విడివిడి కార్యక్రమాల మీద తిరుగుతున్నారు. ఏపి భవన్ నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు గంటల సేపు ఎక్కడున్నారో బయట ఎవరికీ తెలియదు. ఆయన అజారుద్దీన్ ని కలుసుకోవటానికి వెళ్ళారని ఏపి భవన్ లో చెప్తున్నారు. కానీ అదే నిజమైతే మరి అంత రహస్యంగా బయలుదేరి పోవటం దేనికన్నది తెలియక పార్టీ శ్రేణులకు కూడా అంతుపట్టటం లేదు.
సరే, రెండు గంటలు సొంత పని మీద పోయినా తప్పు లేదు. కానీ, ఢిల్లీలో రెండు రోజుల పాటు పడిగాపులు పడి రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారూ అంటే, ఏమీ లేదు. కేవలం రాజకీయ లబ్ధి, అధిష్టానానికి తృప్తి కలగటానికి పావులు కదుపుతున్నారు.
అలాగే, ప్రజాధనాన్ని వినియోగిస్తూ రాష్ట్రంలో కూడా పర్యటనలు చేస్తూ చేస్తున్నదేమిటమ్మా అంటే అదీ పార్టీని బలోపేతం చేసే ప్రచార కార్యక్రమాలే.
మేము రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం అని చెప్పుకోవటంవరకే కానీ నిజానికి అన్ని పనులూ వాటంతటవే అయిపోతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమైన పదవుల్లో ఉండి ఇలా రోజుల తరబడి ఢిల్లీ పెద్దల కను సంజ్ఞలను కనిపెట్టి నడుచుకోవటమన్నది నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టమే అంటున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారంటూ చేస్తున్న ఆరోపణలకు ఊతమివ్వటం జరుగుతోంది. పోనీ ఏ విషయాన్నైనా తేలుస్తారా అంటే ఢిల్లీ లోని పార్టీ పెద్దలు దేన్నీ స్పష్టంగా చెప్పరు. దానితో ఏం చెయ్యాలో ఏం చెయ్యద్దో, ఏం మాట్లాడాలో , ఏం మాట్లాడొద్దో తెలియని పరిస్థితి.
ఢిల్లీలో కూర్చున్న పార్టీ పెద్దలను అనటానికి కూడా లేదు. వాళ్ళ పరిస్థితీ అగమ్యగోచరంగానే ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్ల లాగా, రోగులకు సంబంధించినవాళ్ళు ఏమడిగినా ముభావంగా ఉంటూ, లోతైన ఆలోచనల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ కేవలం తలాడించి, మరిన్ని రిపోర్ట్ లను అడిగేవారిలా ప్రవర్తించాల్సి వస్తోంది. డాక్టర్లూ, నర్సులు హడావిడిగా తిరుగుతుంటారు.వాళ్ళ నోట్లోంచి ఏమాట వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోగుల కుటుంబీకులకు చాలా సందర్భాల్లో ఏ వివరణా లభించదు. కానీ అపత్యం చెయ్యటమో, లేకపోతే తెమ్మన్న రిపోర్ట్ లు తేకపోవటమో, తీసుకోమన్న జాగ్రత్తలు తీసుకోకపోవటమో చేస్తే మాత్రం వాళ్ళ మీద విరుచుకుపడతారు. అదిగో, ఢిల్లీలో కూడా అదే సన్నివేశం కనిపిస్తోంది. అధిష్టానం నుంచి వచ్చే పలుకుల కోసం చేతులు కట్టుకుని, చెవులు రిక్కించుకుని ఎదురు చూసి, రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత మాత్రం బోరవిరుచుకుని మాట్లాడుతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more