పూజారులను బలిపశువులను చేసారంటూ ఉత్తరాంధ్ర అర్చక సంఘం వాళ్ళు ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా లోని శ్రీకూర్మం దేవాలయంలో పవిత్రమైన ఆలయంలో స్వామివారి మీద మైనం అద్ది కొలతలు తీసారంటూ భక్తులు చూపించిన ఆగ్రహంలో ఒక పూజారి గాయపడ్డారు. జరిగిన సంగతి పొక్కగానే తండోపతండాలుగా భక్తులు శ్రీకూర్మం లోని ఆలయంలోకి ప్రవేశించి పూజార్ల మీద దాడిచేసారు. జరిగిన తంతుని ప్రత్యక్షంగా చూసిన కొందరు భక్తులు ఈ విషయం బయట చెప్పటంతో వార్త దావానంలా వ్యాపించింది.
పోలీసులు వచ్చి అదుపుచేసే ప్రయత్నంలో లాఠీ చార్జి కి కూడా దిగాల్సివచ్చింది. రాళ్ళతో దాడి చెయ్యటంతో ప్రధానార్చకుడు గాయపడ్డారు. ఆలయ కార్యాధికారిని కూడా భక్తులు వదిలిపెట్టలేదు.
బెంగళూరులోని ఒక వ్యాపారి కోరికమీద వెండి ఆభరణాలు చేయించటం కోసం ఆ పని చేసామని పూజార్లు చెప్పారు. పోలీసులు అర్చకులు, ఈవో ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. ఆలయ ఈవో మాత్రం జరిగిన సంగతి తనకేమీ తెలియదని చెప్పారు.
విషయం తెలిసిన భారతీయ స్వాభిమాన ట్రస్ట్ శ్రీకాకుళ శాఖ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద, శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయ ట్రస్టీ బరతం కామేశ్వరరావు, విశ్వహిందూ పరిషత్ నాయకుడు చంద్రశేఖరరావు, వైకాపా నేతలు అంతా ఆలయ అధికారులు, పూజార్ల మీద కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, విశాఖపట్నం శారదా పీఠం పీఠాధిపతి ఈ ఘటన మీద దర్యప్తు చెయ్యాలని కోరారు.
జరిగిన విషయం మీద ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తరాంధ్ర అర్చకుల సంఘం, అర్చకులను అనవసరంగా బలిపశువులను చేసారంటూ ఆరోపించారు. ఈవో ప్రసాద్ పట్నాయక్ తో సంప్రదించిన తర్వాతనే మైనంతో కొలతలు తీసుకున్నామని, ఈవో ఆ విషయాన్ని దాస్తున్నారని వాళ్ళు అన్నారు. అంతేకాదు, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏ పనీ చెయ్యలేదని, కొలతలు తీసుకోవటానికి మైనంతో తీసుకోవటమే మార్గం తప్ప మరో మార్గాంతరమేమీ లేదని వాళ్ళు అన్నారు.
అబద్ధాలు చెప్పి భక్తులు, మీడియా ఇలా అందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఈవోని వెంటనే సస్పెండ్ చెయ్యాలని వాళ్ళంతా కోరారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more