వస్తున్నా మీకోసం కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లాలో ములగపూడిలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు, పేదలను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసమే పనిచేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి ప్రజల్లో అవగాహన పెంచటానికే తను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.
తెలుగు దేశం పార్టీ హయాంలో కేవలం 25000 కోట్ల రూపాయలున్న రాష్ట్ర బడ్జెట్ ని ఇప్పుడు అమాంతం 165 వేల కోట్ల రూపాయలకు పెంచేసారని, దానికోసం పన్నుల రూపంలో ప్రజల దగ్గర్నుంచి 70000 కోట్ల రూపాయలను, మరో 20000 రూపాయలను మద్యం మీద వసూలు చెయ్యటానికి లెక్కలు వేసుకున్నారని దీని వలన సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని చంద్రబాబు అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్ ధర, విద్యుత్ ఛార్జీలు, నీటి ఎద్దడి కింద నలిగిపోతున్న పేదలకు అంత పెరిగిన బడ్జెట్ వలన ప్రయోజనమేమీ కలుగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవటంలోనే నిమగ్నమైందని చంద్రబాబు అన్నారు. బడ్జెట్ పెరిగిందంటే రాష్టంలోని ప్రభుత్వం చేసే ఖర్చులు పెరిగినట్టు. అయితే దానివలన సామాన్య ప్రజలకు ప్రయోజనం కలగనప్పుడు బడ్జెట్ పెంచి లాభమేమిటి, పెంచిన బడ్జెట్ భారం పన్నుల రూపంలో ప్రజల మీద వెయ్యటమేమిటన్నది చంద్రబాబు ప్రశ్న.
అలాగే తెదేపా హయాంలో పనికి ఆహారం పథకం కింద 54000 లక్షల టన్నుల ధాన్నాన్ని పేదలకు పంచిపెట్టారని, ఇప్పుడు ఉపాధి హామీ కింద వంద రోజుల పనికి కూడా గ్యారెంటీ లేకుండా పోయిందన్నారాయన.
తొమ్మిది సంవత్సరాలుగా కరువు వరదల వలన రాష్ట్రంలో 54000 కోట్ల నష్టం వాటిల్లిందని, కానీ ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి కేంద్రం నుంచి కేవలం 3000 కోట్ల రూపాయలన నిధులను మాత్రమే గ్రహించగలిగారని, రాష్ట్రం లని 32 ఎంపీలు, 10 మంది కేంద్ర మంత్రులు ఉండి కూడా ఈ విషయంలో రాష్ట్రానికి ఏమీ చెయ్యలేకపోయారని చంద్రబాబు వాపోయారు. తమ బాధలు వినే నాథుడే లేక సామాన్యప్రజలు అలమటిస్తున్నారని చెప్తూ, తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తే ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయని హామీ ఇచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more