కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి అనుకోని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటికి కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజారాజ్యం నాయకులుగానే చూస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నాయకులైన ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్ పార్టీలో విలువలేకుండాపోయింది. చిరంజీవి, గంటా శ్రీనివాసరావు, రామచందయ్య, మంత్రులుగా కొనసాగుతున్నప్పటికి వీరి మాటలకు , వీరి లేఖలకు కాంగ్రెస్ పార్టీలో విలువులేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాక్షిగా రుజువు అయింది. రాష్ట్రంలో పెను సమస్యగా మారిన విద్యుత్ చార్జీల పెంపు. ఈ విషయం పై కేంద్ర మంత్రి చిరంజీవి మీడియా ముందు అనేసార్లు ప్రకటనలు చేయటం జరిగింది. విద్యుత్ ఛార్జీల పెంపును మంత్రి చిరంజీవి తీవ్రంగా ఖండించటం జరిగింది. చిరంజీవితో పాటు .. మిగిలిన నాయకులు కూడా మాట కలిపి.. విద్యుత్ ఛార్జీలకు పెంపుకు వ్యతిరేకంగా ప్రజల ముందు ప్రచారం చేయటం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కరెంట్ ఛార్జీల పెంపునుకు నిరసనగా దీక్షలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ ఛార్జీలు తగ్గించే చర్యలు లేవని కచ్చితంగా చెప్పినట్ల తెలుస్తోంది. అయితే ఈ సందర్భంలోనే కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది.
కరెంట్ ఛార్జీల పెంపు పై వెంటనే తగ్గించాలని కోరుతూ లేఖ రాయటం జరిగింది. అయితే ఈ లేఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదగా ముఖ్యమంత్రికి అందించటం జరిగింది. చిరంజీవి రాసిన లేఖను అందుకున్న సీఎం కిరణ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యి.. చిరంజీవి రాసిన లేఖను చదవకుండానే చెత్తబుట్టలోకి విసిరివేయటం జరిగిందని ..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రీసెంట్ గా చిరంజీవి మీడియాలో మాట్లాడిన మాటలను వేటకారం చేస్తూ... మంత్రి గంటాకు సమాధానం చెప్పకుండా సీరియస్ గా లేచి వెళ్లిపోయినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే జరిగిన పరిణమంతో షాక్ తిన్న మంత్రి గంటా వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు చిరంజీవి పై ముఖ్యమంత్రి కిరణ్ ఎగిరిపడటానికి కారణం ఏమిటి? కిరణ్ కోపం వెనుక ఉన్న అర్థం ఏమిటి? చిరంజీవి లేఖను ఎందుకు విసిరికొట్టారు అంటే కాంగ్రెస్ నాయకులు అనేక కారణాలు చెబుతున్నారు. కరెంట్ ఛార్జీలపై ప్రజారాజ్యం పార్టీ నాయకులు తప్ప ..కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు మాట్లాడలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీడియా ముందు ప్రకటనలు చేయటం. మంత్రి చిరంజీవి ఎదుగుతున్న తీరు ..ముఖ్యమంత్రికి అసలు నచ్చటం లేదట. అంతేకాకుండా .. ప్రజారాజ్యం పార్టీ నాయకుల మీద ముఖ్యమంత్రి నిఘా కెమెరాలు పెట్టి, వారు ఫోన్లు కూడా ట్యాఫింగ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.
అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ నాయకులు మీద త్వరలో సోనియా గాంధీకి ఫిర్యాదు చెయ్యటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమైనట్లు కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. గతంలో కూడా పీసీసీ చీఫ్ బొత్స సత్యానారయణ మీద కూడా కేంద్ర నాయకులు ఫిర్యాదు చేసినట్లుగా గాంధీభవన్ లో నాయకులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మంత్రి చిరంజీవి గ్యాంగ్ పై కూడా ఫిర్యాదు చేసి .. అమ్మదగ్గర మంచి మార్కులు పొందాలని సీఎం కిరణ్ చూస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో స్పీకర్ గా ఉన్న సమయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి రిపోర్టులు పంపించటం వలనే.. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ..తమిళనాడుకు గవర్నర్ ట్రాన్స్ ఫర్ అయ్యాడని .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈసారి చేసే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసే ఫిర్యాదుతో .. ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more