చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి దిగిరావలసివచ్చింది. 200 యూనిట్ల లోపులో విద్యుత్ ని వినియోగం చేసేవారికి పాత ఛార్జీలే వర్తిస్తాయి. 200 దాటిన వినియోగదారులు మాత్రం వాళ్ళు కొత్త ఛార్జీల పరిధిలోకి వచ్చేస్తారు. వాడకం 201 యూనిట్లయినా సరే ఆ వినియోగదారుడు మొత్తం వాడకం మీద కొత్త ఛార్జీలను కట్టవలసిందే. దీని ద్వారా ప్రభుత్వం మీద పడుతున్న భారం 830 కోట్లని, దాన్ని రాయితీగా పరిగణిస్తామని ప్రభుత్వం అంటోంది.
విద్యుత్ వినియోగదారుల్లో గృహాలలో వాడుకునేవారు 2 కోట్ల మంది ఉన్నారని, అందులో 1.86 కోట్ల మంది దీనివలన లబ్ధి పొందుతారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆనం నారాయాణ రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధరబాబు, సునీతా లక్ష్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి, తదితరులతో సమావేశమై విద్యుత్ ఛార్జీల విషయంలో చర్చలు జరిపారు. కరెంటు కొనుగోలు భారం పెరిగిపోవటం వలన ఛార్జీలు పెంచవలసి వస్తున్నా నిజానికి అది సరి కాదని, పేదల మీద భారం మోపటం మంచిది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. అదీ కాకుండా, ఈ విషయాన్ని తీసుకుని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందుదామని చూడటం కూడా జరుగుతోందని ఆయన మంత్రులకు తెలియజేసారు. సమావేశం అనంతరం అంతా కలిసి మీడియా తో సమావేశమై వారి నిర్ణయాన్ని తెలియజేసారు.
విద్యుత్ ఛార్జీల రూపంలో 2014-14 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చెయ్యదలచుకున్న 6173 కోట్ల రూపాయలలో ప్రభుత్వం ఈ నిర్ణయం వలన 830 కోట్ల రూపాయలను రాయితీగా మరో చోట సర్దుబాటు చెయ్యవలసివుంటుంది.
అయితే ఈ కొత్త నిర్ణయాలకు ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. 6000 కోట్లు పెంచి 800 కోట్లు తగ్గిస్తే అది తగ్గింపా అంటూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించగా, బిచ్చమేసినట్లు, ఎంగిలి మెతుకులు విసిరినట్టున్న ఈ నిర్ణయం ప్రజలను అవమానపరుస్తున్నదని, అందువలన ఆందోళనలను కొనసాగిస్తామని వామపక్షనేతలు మండిపడ్డారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more