హైద్రాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ కి బైబై చెప్పేస్తున్నాయి. ప్రస్తుతం వర్తించే ఛార్జీల మీద 30 శాతం పెంచమని కోరిన ప్రైవేట్ హాస్పిటల్స్ కోరికను ప్రభుత్వం తిరస్కరించటంతో మే 3 నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతించబోవటం లేదు. ఈ లోపులో వచ్చే రోగులను ఆ గడువులోపులో డిశ్చార్జ్ చెయ్యగలిగే పక్షంలోనే వారిని ఈ పథకం కింద తీసుకుంటామని కూడా చెప్తున్నారు.
హైద్రాబాద్ నగరంలో ఉన్న 250 ప్రైవేట్ హాస్పిటల్స్ సంవత్సరానికి రెండు లక్షల మంది రోగులకు ఆరోగ్యశ్రీ కింద 938 నిర్ణీత వ్యాధులకు చికిత్స చేస్తున్నాయి. ఈ పథకాన్ని నిలిపివేయటంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే పేద వర్గానికి చెందిన రోగులకిక నాణ్యమైన వైద్యోపచారాలు లభించటం కష్టమే అవుతుంది. ఇది బాధాకరమైన విషయమే కానీ ఆర్థిక భారాన్ని మొయ్యలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తోందని ఏపి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రెసిడెంట్ డా.డి.భాస్కర్ అన్నారు.
సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వద్యోగులకు ఈ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండగా, తాజాగా తమ డిమాండ్ ని హెల్త్ ఇన్సూరెన్స్ పథకంలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇద్దరు షేర్ చేసుకునే గదుల ఛార్జీలలో 65 శాతం పెంపుకి పెంచుతూ, సింగల్ ప్రైవేట్ గదుల మీద రెట్టింపు చేస్తూ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ కి నోటీసిచ్చారు ఆశా, అప్నా (ఏపి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్) లు.
2007 లో ఈ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ ఖర్చులలో వృద్ధి చాలా ఎక్కువైందని, అయినా ప్రభుత్వం రేట్లను సవరించటానికి ఉత్సుకత చూపించటం లేదని, అంతే కాకుండా ఈ ఆరోగ్యశ్రీ బిలో పావర్టీ లైన్ (బిపిఎల్) లో ఉన్న 28 శాతం మందికే వర్తిస్తుందని చెప్పారు కానీ నిజానికి 28 కాదు 82 శాతం ఇప్పుడు దీనికిందికి వస్తున్నారంటూ ఆశా ప్రెసిడెంట్ ఆరోపించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more