షర్మిల ఆత్మహత్యా అంటే .. మన రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల కాదులేండి. ఈమె మణిపూర్ ఇరోమ్ షర్మిల. ఇప్పుడు ఈమె పై ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. సైనిక ప్రత్యేకాధికారాల (ఎఎఫ్ఎస్పిఎ)చట్టాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ పుష్కర కాలంగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మహిళ ఇరోమ్ షర్మిలపై ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆత్మహత్యాయత్నం అభియోగాలు నమోదు చేసింది. 2000 సంవత్సరంలో ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో సైన్యం 10 మంది పౌరులను కాల్చిచంపినందుకు నిరసనగా షర్మిల అప్పటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 2006లో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష సందర్భంగా ఆమెపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదైంది. అయితే షర్మిల తన నేరాన్ని అంగీకరించకపోవటంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 కింద అభియోగాలు నమోదు చేశారు. 2006 అక్టోబర్ 4న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష సందర్భంగా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనను వినిపించేందుకు కేసును మే 22కు వాయిదా వేశారు. కోర్టు వెలుపల నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి ముందు హాజరైన షర్మిల ‘నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం లేదు. నాది పూర్తిగా అహింసతో కూడిన నిరసన. అంతేకాదు ఓ మనిషిగా జీవించాలన్నదే నా డిమాండ్’ అని స్పష్టం చేశారు. నాకు జీవితం అంటే ఎంతో ప్రేమ.
అలాంటిది నా జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవాలని అనుకోవడం లేదు. నాకు కావలసింది న్యాయం, శాంతి’ అని ఆమె అన్నారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ‘మీరు ఆత్మహత్యాయత్నాకి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన ప్రాధమిక అభియోగాలు కూడా ఉన్నాయి. మరి వీటిని మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. అందుకు షర్మిల ‘లేదు’ అని సమాధానం చెప్పారు. ‘నేను మిమ్మలను గౌరవిస్తున్నాను. కాని ఈ చట్టం మీ జీవితాన్ని మీరు అర్థంతరంగా ముగించుకోడాన్ని అనుమతించదు’ అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు షర్మిలకు వివరించాల్సిందిగా ఆమె న్యాయవాదిని కోరారు. ‘ఎఎఫ్ఎస్పిఎ చట్టాన్ని ప్రభుత్వం రద్దుచేసిన తరువాతే నేను ఆహారం తీసుకుంటాను. నా శరీరంలో అమర్చిన ఆహార గొట్టాన్ని తీసిపారేస్తాను’ అని తన న్యాయవాదికి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more