శ్రీలంకలో తమిళులకు మద్దతుగా తమిళనాడులో ఆందోళన ఉద్ధృతమైంది. లంక అణచివేతకు నిరసనగా మణి (41) అనే సామాజిక కార్యకర్త ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెన్నైలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదుట ఈ సంఘటన చోటుచేసుకుంది. లంక అధ్యక్షుడు రాజపక్సెకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుగుతుండగా పెట్రోలు వంటిపై పోసుకుని మణి నిప్పంటించుకున్నాడు. తమిళనాడు కోస్తా నల్లవాడుకు చెందిన మణి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీలంకలో తమిళుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడానికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. తమిళ యుద్ధ ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న లంక అధ్యక్షుడు రాజపక్సెపై కేసు నమోదు చేసి అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. లంకకు వ్యతిరేకంగా ఐరాస మానవ హక్కుల కమిటీలో భారత్ ఓటువేయాలని వారు డిమాండ్ చేశారు.
మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి తమిళ సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. తమిళనాడు లాయర్స్ అసోసియేషన్, మద్రాసు హైకోర్టు మహిళా లాయర్ల అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించాయి. ఇలా ఉండగా శ్రీలంక డిప్యూటీ హైకమిషన్ ఎదుట పికెటింగ్కు ప్రయత్నించిన ఎండిఎంకె చీఫ్ వైకో సహా పలు తమిళ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తమిళ దేశీయ ఐయక్కం నాయకుడు పి నెడుమారన్ సహా 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ప్రభాకరన్ మాట్లాడుతూ లంకలో తమిళులకు న్యాయం జరగాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more