వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రంలో చేపట్టి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభమవుతోంది. గత సంవత్సరం అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర షర్మిల కాలికి గాయం కారణంగా డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వద్ద నిలిచిపోయింది. ఢిసెంబరు 18న మోకాలికి శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతిలో ఉన్న ఆమె తిరిగి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని వైఎస్సర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభించనున్న యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగించి పూర్తిచేయాలన్న నిర్ణయంతో షర్మిల ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో షర్మిల యాత్రకు ఎలాంటి ఆటంకమూ ఎదురవదని ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు కలిగించాలానుకునే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తెలంగాణ రాకపోవడానికి అసలు కారకులు కాంగ్రెస్ అని, ముందు ఆ పార్టీని నిలదీయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నులు ఛార్జీల, ధరల పెంపులతో పెనుభారాన్ని మోపుతోందని విమర్శించారు.
అయితే షర్మిల ఇప్పటికే 58 రోజుల్లో 828.1 కిలోమీటర్లు నడిచినట్లు ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాస్ట్ర ప్రజలను కలిసి, వారిలో ధైర్యం నింపాలని షర్మిల చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు షర్మిల ప్రతిరోజూ ఫిజియోథేరపీ చేయించుకోవడంతో పాటు వైద్యుల సూచనలన్నింటిని పాటించారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక , కాంగ్రెస్ తన దుష్ట ఆలోచనలతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు మంచి ఆలోచనలతో దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలని సూచించారు. ఇప్పటికే ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నాయకులు వైఎస్ఆర్ పార్టీలోకి క్యూకట్టారు. తిరిగి షర్మిల పాదయాత్ర రాష్ట్రంలో ప్రారంభిస్తే, ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద దెబ్బతగుతుందని రాజకీయ విశ్లేషాకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more