మంత్రి డీకే అరుణ:
తెలంగాణ చరిత్రను వక్రీకరించిన ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్పై మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. ఉండవల్లి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండవల్లి వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని తాము కోరామని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్లో సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
పొన్నం ప్రభాకర్ :
తెలంగాణ చరిత్రను పక్కదారి పట్టిస్తూ ఊకదంపుడు ఉపన్యాసం చేసిన ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్పై ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తమను రజాకార్లతో పోల్చితే, సీమాంధ్ర నేత ఉండవల్లిని పెద్దాపురం వేశ్యతో పోలుస్తామని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లికి పెద్దాపురం వేశ్యకు తేడా లేదన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. రాజమండ్రిలో జరిగిన సభ సమైక్యాంధ్ర సభ అని తేల్చిచెప్పారు. తమను రజాకార్లతో పోల్చిన ఉండవల్లిపై దాడులు జరిగితే తాము బాధ్యులం కాదు అన్నారు. ఖాసీం రజ్వీ మాటలను రుచి చూడాల్సి వస్తది అని హెచ్చరించారు. ఆనాడు 2004లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న విషయాన్ని ఉండవల్లి మరిచారా అని ప్రశ్నించారు. కరీంనగర్ సభలో సోనియా ప్రసంగాన్ని తర్జుమా చేసిన ఉండవల్లికి మతి తప్పిందా అని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని సోనియా చెప్పిన వ్యాఖ్యలను తెలుగులో తర్జుమా చేసిన ఆయన ఆ విషయాన్ని అప్పుడే మరిచిపోయాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి ఊసరవెల్లి మాటలు మాట్లాడటం మానుకోని సత్యాలను ప్రజలకు తెలియపరిచేలా ప్రవర్తిస్తే మంచిదన్నారు. మరీ జై ఆంధ్రప్రదేశ్ సభకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. తెలంగాణపై సీమాంధ్ర పెత్తందార్ల పెత్తనం సాగదని తేల్చిచెప్పారు. బొత్స సత్యనారాయణ పీసీసీ ఛీప్ ఏపీకా, ఆంధ్రాకా అని ప్రశ్నించారు. తాము గట్టిగా మాట్లాడితే వారు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తారు. మీరు వైసీపీలోకి వెళ్తే తప్పు కాదా అని ప్రశ్నించారు.
కేటీఆర్ :
తెలంగాణ చరిత్రను కించపరిచేలా మాట్లాడిన ఉండవల్లి అరుణ్కుమార్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీ రామచందర్రావు డైరెక్షన్లో వీధి నాటకాలు ఆడుతూ రంగ స్థల నటుడిలా ఉండవల్లి అవతారమెత్తాడని ఆయన విమర్శించారు. రాజమండ్రి సభలో ఉండవల్లి చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. సీమాంధ్ర నేతల పాత ప్రసంగాలను ఆయన ప్రదర్శించారు. తమది వేర్పాటు వాదమైతే మద్రాసు నుంచి విడిపోయిన మీది ఏ వాదం అని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే అవమానించిన చరిత్ర ఉండవల్లిది అని ధ్వజమెత్తారు. ఉండవల్లి లాంటి దుర్మార్గులు ఉంటారనే అంబేద్కర్ ఆర్టికల్ 3ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మొదటి ఎస్సార్సీ విశాలాంధ్ర కావాలన్నదని ఉండవల్లి పచ్చి అబద్ధాలు చెప్పారని స్పష్టం చేశారు. కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, నర్సింగరావులాంటి తెలంగాణ నేతలు విలీనాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. విశాలాంధ్ర వాదన సామ్రాజ్యవాద కాంక్షతో నిండి ఉందని నెహ్రూ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కానీ నెహ్రూ వ్యాఖ్యలను ఉండవల్లి వక్రీకరించారని తెలిపారు. చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చిన వారు ఇప్పుడు కోటీశ్వరులై బలిసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజనులను చంపేసైనా పోలవరం ప్రాజెక్టును కట్టాలని ఉండవల్లి చెప్తున్నారని మండిపడ్డారు. నదికి నదినే మలుపుకు పోతే రాజశేఖర్రెడ్డిని జలదొంగ అనకపోతే ఏమి అనాలని ప్రశ్నించారు. ఆర్డీఎస్ తూములను బాంబులతో బద్దలు కొట్టి పాలమూరు నీళ్లను దోచుకుపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నోళ్లు ఎండబెట్టి నారుమళ్ల కోసం నీరు తరలించుకు పోలేదా అని అడిగారు. పేరుకే జై ఆంధ్రప్రదేశ్ సభ కానీ, అక్కడ ఒక్క తెలంగాణ నాయకుడు లేరని తెలిపారు. సీమాంధ్ర నేతల ఉన్మాద వైఖరి వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీమాంధ్ర నాయకులది వంకరబుద్ధి అని, చిల్లర నాటకాలు మానుకోవాలని హెచ్చరించారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు చీము, నెత్తురు ఉంటే బయటకు వచ్చి ప్రజలతో కలిసి తెలంగాణ కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఉండవల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు పార్టీని వీడకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు :
తెలంగాణను కించపరిచేలా మాట్లాడిన సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్పై తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీలకతీతంగా ఉండవల్లిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఎల్లప్పుడూ బాబుకు వత్తాపు పలికే ఎర్రబెల్లి దయాకర్రావు సైతం ఉండవల్లిపై నిప్పులు చెరిగారు. రాజమండ్రి సభలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్ధాలేనని తేల్చిచెప్పారు. ఉండవల్లి ఓ అబద్ధాల కోరు అని తెలిపారు. ఆత్మహత్యల గురించి మాట్లాడే వారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more