ఆ స్వరంలో స్వచ్చమైన పాటలు తప్ప.. మాటలు రాని స్వరం ఆమెది. ఆ స్వరంతో ఎంతో మంది సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచారు. పాటల లోకంలో మునిగిపోయి, ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంది ఆమె. ఆమె పాట వినబడితే చాలు.. ప్రక్రుతి సైతం పరవశించిపోతుంది. పాలు తాగే పసిపిల్లవాడి దగ్గర నుండి పండు ముసలివాడి వరకు ఆమె స్వరం నుండి పాటల కోసం ఆశగా ఎదురుచూస్తుస్తారు. ఆమె పాటకు ముగ్ధులుగానీ మనుషులు ఎవరు ఉంటారు చెప్పండి? అలాంటి ఆమె స్వరంలో ఈ రోజు మాటలు బయటకు వచ్చాయి. ఆమె ప్రభుత్వం చిన్నచూపు చూసింది. 55 ఏళ్లుగా పాడుతున్నా ఆమె పై ప్రభుత్వం చిన్నచూపు ఎందుకు చూసింది? అనే ప్రశ్న ఆమె అభిమానులు అడుగుతున్నారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ గాయని ఎస్ జానకి. ఈ రోజు కేంద్రం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ప్రముఖ గాయని ఎస్.జానకి తిరస్కరించారు. 55 ఏళ్లుగా పాడుతున్నా..ఇప్పుడు పద్మభూషణ్ను ఇచ్చారు. ఇన్నాళ్ళ తర్వాత తనకు ఇవ్వాల్సింది పద్మభూషణ్ అవార్డు కాదని, ఇంకా పెద్ద అవార్డు ఇవ్వాలని ఆమె అన్నారు. అయినా అవార్డుల కోసం తాను పాడలేదని, అభిమానుల కోసం పాడానని ఎస్.జానకి తెలిపారు. ఉత్తరాది వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఉత్తరాదివాళ్లతో మనమేం తక్కువ, గాయని సుశీలకు ఏం తక్కువ అని ప్రశ్నించారు. ఉత్తరాదివాళ్లకు భారతరత్నం ఇచ్చినప్పుడు తాము ఎందులో తక్కువ అని, పద్మవిభూషణ్కు కూడా పనికిరామా అని జానకి అన్నారు. భారతరత్న ఇస్తే సంతోషిస్తానని ఆమె తెలిపారు. ఇస్తే భారతరత్న తీసుకుంటానని మరే అవార్డు తీసుకోనని ఎస్.జానకి తేల్చిచెప్పారు. ఇన్నాళ్లుకు ఎస్ జానకి స్వరం నుండి నెలకు రాలిన మాటలు ఇవే? జానకి ఎప్పుడు అవార్డుల కోసం పాటలు పాడలేదు కానీ.. జనం కోసం పాటలు పాడెను. అప్పుడు రాని అవార్డు ఇప్పుడెందు? ఇస్తే భరతరత్న ఇవ్వండి? ఈ అవార్డు నాకొద్దు అని జానకి తెల్చిపారేసింది. ఎస్ జానకి అడగటంలో తప్పు లేదని సంగీత ప్రియులు అంటున్నారు. ఈ విషయం ప్రభుత్వం ఆలోచించాలని ఆమె అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more