మాజీ సీఎం , తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయిన ఆయన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతున్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన సభలకు తమిళనాడ్ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ ద్యాన మహా సభలకు కూడా ఆయన హజరైనట్లు తెలుస్తోంది. రోశయ్య పై ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను చూసి ఆయన చాలా బాధపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ పార్టీ సీనియర్ నాయకుడు గురించి పట్టించుకోకపోతే ఏలా అని రాజకీయ పండితులు అడుగుతున్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభలకు పెద్దాయనకు పిలుపు రాలేదని రోశయ్య అసంతృప్తి గా ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో నిర్వహణ లోపాలతో సర్వత్రా విమర్శలెదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కొణిజేటి రోశయ్య పట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభలకు వెళ్లరాదని రోశయ్య నిర్ణయించుకున్నారు. మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన లేఖ మేరకు 29న తిరుపతి వెళ్లాలని రోశయ్య ముందుగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా పంపారు. కానీ, ఆయన్ను మళ్లీ ఎవరూ సంప్రదించకపోవడంతో మహాసభలకు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా తమిళనాడు సీఎం జయలలితకు కూడా నిర్వాహకులు ఆదిలో ఆహ్వానపత్రం అందించినా తరువాత సమాచారం లేకపోవడంతో మహాసభలకు వెళ్లరాదని ఆమె నిర్ణయించుకున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి ఇలా అవమానం జరగటం పై కాంగ్రెస్ నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వలనే జరిగిన తప్పు అన్నట్లు కొంత మంది కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో చెప్పుకుంటున్నారు. అయిన ఒక తెలుగు నాయకుడికి తెలుగువారే అవమానం చేస్తే ఆయన ఎవరితో చెప్పుకుంటారు. అదీ ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా జరగటం పై అనేక మంది కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు కురిపిస్తున్నారు. తమిళనాడు గవర్నర్ జరిగిన విషయం కాంగ్రెస్ అధిష్టానం ఏం అంటుందో వేచి చూడాలి..?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more