వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో షర్మిల రాజకీయ పార్టీల పై విరుచుకుపడుతన్నారు. జగన్ జైల్లో ఉంటే .. షర్మిలా మాత్రం పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో తిరుగుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరస్తూ ముందుకు పోతుంది. అయితే ఆమె ప్రసంగంలో ఎక్కువగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెబుతుందని ప్రజలంటున్నారు. ఒక పక్క టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు తెలంగాణ లో పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఆదిలబాదు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. షర్మిలా మాత్రం రంగారెడ్డి జిల్లా పాదయాత్ర చేస్తున్నారు. అయితే షర్మిల పాదయాత్రలో .. ఉదయించే సూర్యుడిని ఆపలేనట్టే జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయ షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ప్రవేశించింది. కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కై జగన్ బయట ఉంటే తమ ఓటమి ఖాయమని తెలిసి సిబిఐ దాడుల ద్వారా జైలుపాలు చేశారని విమర్శించారు. దేవుడున్నాడని, మంచిని కోరుకునే జగన్ తప్పకుండా బయటకు వస్తాడని, రాజన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ అమలు చేస్తూ అన్నివర్గాల ప్రజల కోసం కృషి చేస్తాడని అన్నారు.
వైఎస్సార్ ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు ఉచిత కరెంట్, 12 కోట్ల రుణాల మాఫీ చేశాడని, తద్వారా తాను ఉన్నానన్న భరోసాను రైతులకు ఇచ్చాడని, ఆయన మరణించిన తర్వాత గత మూడేళ్ళలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, కరెంట్ను సరిగ్గా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పావలావడ్డీ రుణాల ద్వారా వైఎస్ఆర్ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రస్తుత ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలంటూ ఎవరికీ రుణాలు ఇవ్వకుండా మహిళలను దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం అన్ని రకాల ధరలు నాలుగింతలు పెరగడంతో పూట గడవక అనేకమంది తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా కూలీలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసి చార్జీలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై అధికభారం మోపుతున్నారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ పథకం ద్వారా 47 లక్షల మందికి ఇళ్లు నిర్మించిన ఘనత వైఎస్సార్కు దక్కుతుందని, ఇప్పుడు ఇళ్లు ఇవ్వకపోగా కట్టిన ఇళ్లుకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ ద్వారా లక్షల విలువైన వైద్యాన్ని వైఎస్ అందిస్తే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చెత్తకుప్పల్లో పడవేసే పరిస్థితి దాపురించిందన్నారు. మానవత్వంలేని ప్రస్తుత సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తోందని దుయ్యబట్టారు. అవసరం లేకున్నా చంద్రబాబు పాదయాత్ర చేపడుతున్నాడని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అవిశ్వాసం ద్వారా పడగొట్టే శక్తి ఉన్నప్పటికీ బాబే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడని దుయ్యబట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగుల సంక్షేమం తిరిగి యథాతథంగా కొనసాగాలంటే రాజన్న వారసుడు జగన్ను ప్రతిఒక్కరూ దీవించాలని కోరారు. అంతేకాకుండా రాజన్న రాజ్యాన్ని ఎవరూ ఆపలేరని అలాగనే నన్ను ఎవరు ఆపాలేరని షర్మిల అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more