మంత్రి ధర్మన ప్రసాదరావు కొన్ని ఆరోపణలు రావటంతో ఆయన వెంటనే తన మంత్రి పదవి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులంత ఆయన్ని మంత్రిగానే చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం నేను ఇప్పటికీ ఎమ్మెల్యేనే.. సహచరులు మాత్రం నన్ను మంత్రిగా, ఇన్చార్జ్ మంత్రిగా సంబోధిస్తున్నారు.. అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. ఇన్చార్జ్ మంత్రిగా నియమితులైన మర్నాడే విశాఖ వచ్చారు. వెనువెంటనే ఆయనపై సిబిఐ అభియోగాలు మోపడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. ధర్మాన ఇన్చార్జ్ మంత్రిగా లేనందువలన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విశాఖ జిల్లాలో నిర్వహించాల్సిన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని రెండు, మూడుసార్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, బాలరాజు పదే పదే ధర్మానకు ధైర్యం చెపుతూ బాసటగా ఉంటూ, మంత్రిగా బాధ్యతలు కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు. అయినపప్పటికీ ధర్మాన అన్నమాటకు కట్టుబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమం ఖరారైంది.
ఈనెల 17,18,19 తేదీల్లో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇన్చార్జ్ మంత్రిగా ధర్మాన ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాల్సి ఉంది. ముఖ్యమంత్రి, మంత్రుల ఒత్తిడి మేరకే ధర్మాన విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని సమీక్షించేందుకు వచ్చారు. కానీ ఆయన అన్యమనస్కంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కొంత మేరకు ఖరారు చేశారు. ధర్మాన ప్రసాదరావును వెంటబెట్టుకుని జిల్లా అధికారులతో మంత్రులు గంటా, బాలరాజు ముఖ్యమంత్రి పర్యటనను ఖరారు చేసే పనిలో పడ్డారు.అధికారుల సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ముభావంగా కనిపించారు. గతంలో ఉన్న ఉత్సాహం ఇసుమంతైనా కనిపించలేదు. సమావేశం ఆద్యంతం ఆయన దిగాలుగానే కనిపించారు. ఆ తరువాత విలేఖరుల సమావేశం జరిగింది. అందులో గంటా శ్రీనివాసరావు, బాలరాజు అనర్గళంగా ప్రసంగించారు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం ముభావంగా ఉన్నారు. విలేఖరులు పదే పదే ధర్మానను మాట్లాడాల్సిందిగా కోరినా అంగీకరించలేదు. తన బదులుగా ఇద్దరు మంత్రులు మాట్లాడారు కదా! అని సమావేశాన్ని ముగించాలనుకున్నారు. విలేఖరులు పట్టుబట్టడంతో తను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని అన్నారు. నేను మంత్రినని, ఇన్చార్జ్ మంత్రినని ఎక్కడా చెప్పడం లేదు.. నా సహచరులే మంత్రిగా సంబోధిస్తున్నారు.. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమం జరిగింది.. ఆ అనుభవాలను వీరికి వివరించేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చానని ధర్మాన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more