తమిళనాడులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లు మాజీ ముఖ్యమంత్రి ఢిఎంకే ఛీప్ ఎం కరుణానిధి పై పుకార్లు పుట్టాయి. అయితే ఇలాంటి పుకార్లు ఎలా పుట్టాయో తెలియాదు కానీ .. అవి కాస్త కరుణానిధి చెవిలో పడ్డాయట. అంతే ఆయన కుటుంబ సభ్యులు, కరుణానిధి కలిసి ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పుకార్లతో ఆయన అభిమానులు వేల సంఖ్యలో కరుణా నిధి ఇంటి ముందు చేరుతున్నారట. కరుణానిధి ఇంట్లోని ఫోన్లు మోగుతునే ఉన్నాయాట. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేక కరుణా నిధి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశ విదేశల నుండి, రాజకీయ పార్టీల నుండి కరుణా నిధి అభిమానులు ఫోన్లు చేసి ఆయన గురించి వాకబు చేస్తున్నారట. దీనిపై కరుణా నిధి కుటుంబం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న రకరకాల పుకార్లను కట్టాడి చేయటానికి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి పుకార్లు ఎవ్వరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యం గురించి ఏవేవో పుకార్లు వస్తున్నాయి. వాటిని ఎవరూ నమ్మవల్సిన అవసరం లేదని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆప్రకటన ద్వార చెప్పటం జరిగింది. 88 ఏళ్ల కరుణానిధి అనారోగ్యంపై వచ్చిన పుకార్ల నేపథ్యంలో మీడియా సైతం ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రకటన విని ఆయన అభిమానులు, బందువులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.కరుణా నిధి పై ఎవరో కావాలని ఇలా పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆపార్టీ కార్యకర్తలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more