ఇటీవల కాలంలో మతం మార్చుకుంటున్న వారు చాలా ఎక్కువుగా కనిపిస్తున్నారు. అలాంటి ఒక రాజకీయ కుటుంబం పూర్తిగా మారిపోయింది. వారి మనస్సు వరకు మారితే బాగుండేది. కానీ వారి మనస్సుతో ఆ మతాన్ని కూడా రాజకీయం చేశారాని ఆ మతస్థులు ఆరోపిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుటుంబం క్రైస్తవ మతం తీసుకున్న విషయం తెలిసిందే. వారు మతం మారటం వల్ల ఎవరికి నష్టం లేదు. ఎవరికి లాభం కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ మతాన్ని వైఎస్ కుటుంబం రాజకీయానికి ఉపయోగించుకుంటుందని క్రైస్తవ సంఘలు మండిపడితున్నాయి. ఇటీవల వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు మెరుపు మెరిసి మాయం అయ్యే వైఎస్ విజయమ్మ వలన రాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తున్నాయాని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. విజయమ్మ క్రైస్తవ మతం తీసుకున్నప్పటికి ఆమె ప్రతి రాజకీయ మీటింగులకు, ప్రజల వద్దకు వెళ్లినప్పుడు బైబిల్ తో వెళ్లటం పై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. సాధారణంగా క్రైస్తవులు విగ్రహారాధన, హారతులు లాంటి అంశాలకు దూరంగా ఉంటారు.
కానీ విజయమ్మ బైబిల్ పట్టుకుని అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ సామాజికర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయని క్రైస్తవ సంఘలు ఆరోపిస్తున్నాయి. క్రైస్తవుడిగా చెప్పుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో క్రైస్తవులకు ఒరిగిందేమీ లేకపోగా రాజ్యాంగానికి విరుద్దంగా ఆ వర్గాలు ఇబ్బంది పెట్టే జీవోలను తెచ్చారని వారు విమర్శించారు. రాజకీయ నేతలు తమ వ్యక్తిగత విమర్శల కోసం ఇతర మతాల మనోభావాలను అగౌరవపరిచే విధంగా మాట్లాడం శిక్షార్హమన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని వారు సూచించారు. క్రైస్తవులం అంటూ చెప్పుకొని తిరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన పార్టీలో మాత్రం రెడ్డి వర్గానికి పెద్ద పీఠ వేయటం చాలా ఘోరమైన విషయం అని రాజకీయ పార్టీలు అంటున్నాయి. దీనిని బట్టి వారు మతం మారిన , వారి మనసు మాత్రం మారలేదని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more