నల్గొండ జిల్లా సూర్య పేటలో నిన్న రాత్రి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సమరభేరి సభ విజయవంతం అయింది. ఈ సభకు తెలంగాణ ప్రజలు నాయకులు హాజరయ్యారు. ఈ సమరభేరి సభలో కేసీఆర్ గర్జించాడు. కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు, రాష్ట్రసాధనే ధ్యేయం అని, కర్తవ్యం మీముందే ఉందని తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. పాదయాత్రల పేరుతో మీ ముందుకు వస్తున్న పార్టీలను నమ్మ వద్దని, కల్లిబొల్లి మాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చే ఆంధ్ర పార్టీలను తరిమి కొట్టాలని, స్వీయ ఆస్తిత్వంలో కూడిన తెలంగాణ రాజ్యం కావాలి మన పొట్ట కొట్టే గజ దొంగల రాజ్యాలు మనకు వద్దు అని కేసీఆర్ తనదైన శైలిలో గర్జించారు. తొమ్మిదేళ్ళు పాలించిన చంద్రన్న రాజ్యం, ఐదున్నరేళ్ళు పాలించిన రాజన్న రాజ్యాలని చూశామని ఆ గజ దొంగల పార్టీలని నమ్మవద్దని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసంచబోరని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ భూములు, ఆస్తులు, వనరులు కొల్లగొట్టారని ఆయన అన్నారు. వైయస్ తన కూతురుకి, అల్లుడికి బయ్యారం గనులు, కొడుకు అయిన జగన్కు ఓబుళాపురం గనులను ఇచ్చారని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్కు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు దారాదత్తం చేశారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఎవరూ జైలుకు పంపించలేదని, కోర్టులే పంపించాయని, కోర్టులు కుట్ర చేశాయని విజయమ్మ అనగలరా అని ఆయన అన్నారు. ఎవరో వచ్చి ఏదేదో చెప్తే ఆగమాగం కావద్దని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. డిసెంబర్ 9వ తేదీన తెచ్చుకున్న తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం రాజన్న రాజ్యంలోనివేనని, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఝంగా మార్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం దేశ ప్రజలంతా ఒప్పుకోవాలని వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రజలను అడిగిందా అని ఆయన అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విధానాన్ని చంద్రబాబు ప్రారంభిస్తే చంద్రబాబు కొనసాగించారని, సిఎం పదవి కూడా కాంట్రాక్టు ఉద్యోగమైతే పీడా పోయేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూశారని విజయమ్మ అంటున్నారని, తిరుపతిలో రిమ్స్ పూర్తయి బీబీనగర్ నిమ్స్ ఎందుకు పూర్తి కాలేదని అన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ కారణంగా నివాసం యోగం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాజన్న రాజ్యంలో జగన్ దందాల వల్ల అధికారులు, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. గత 56 ఏళ్లుగా కాంగ్రెసును మోసం చేస్తోంది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. ఆంధ్ర నాయకుల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల వెనక నాలుగున్నర కోట్ల ప్రజలున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 24 జిల్లాలు ఏర్పాటవుతుందని, సూర్యాపేట కూడా ఓ జిల్లా అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణకు కోసం చర్చలకు పిలిస్తే అయినను పోయి రావాలె హస్తినకంటూ వెళ్లాలని, కాంగ్రెసు మొండిచేయి చూపిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి కూడా అంగీకరించామని ఆయన చెప్పారు. అయితే, కాంగ్రెసు మళ్లీ దొంగ నాటకం ఆడిందని ఆయన అన్నారు. లక్ష్యాన్ని మధ్యలో వదిలేసే నీచమానవులం తాము కాదని ఆయన అన్నారు. తన తల తెగిపడినా ఎత్తిన జెండా దించేది లేదని, ఆరు నూరైనా తెలంగాణ సాధించుకుంటామని ఆయన అన్నారు. ఈ సమర భేరిలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more