వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో రికార్డులు సాధిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి రికార్డు సాధించాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేని ఓదార్పు యాత్ర పేరుతు రాష్ట్రం అంత తిరిగిన రాజకీయ నాయకుడిగా రికార్డు సాధించాడు. ఐదు సంవత్సారాల్లో లక్ష కోట్లు సంపాదించి దేశంలోని సరికొత్త రికార్డు సాధించాడు జగన్. ఇప్పుడు జైల్లో ఉండి కూడా రికార్డు సాధిస్తున్నాడు. ఒక వీఐపీ ఖైదీగా ఉన్న జగన్ ఇలాంటి రికార్డు సాధించటంతో పోలీసులకు ఆశ్చర్యం కలుగుతుందట. ఆయన జైల్లో ఉంటే ఇలా రికార్డు సాధిస్తే... ఈ బయట ఉంటే ఎన్ని రికార్డులు సాధించాడోనని పోలీస్ వర్గాలు అనుకుంటున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ములాఖత్ ల విషయంలో కూడా రికార్డు సాధించాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడిన సాధారణ ఖైదీ తన జైలు జీవితం మెత్తంలో సాధించలేని ఘనతను ఆయన కేవలం నాలుగు నెలల్లో సాధించారు. మే 29 నుంచి సెప్టెంబర్ 27 వరకూ ఆయన 42 ములాఖత్ల ద్వారా 134 మందితో మాట్లాడారు.
రిమాండ్ ఖైదీ రోజుకు ఒకరి కన్నా ఎక్కువమందితో మాట్లాడటం దేశ చరిత్రలోనే రికార్డని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్మోహనరెడ్డి కేవలం 122 రోజుల్లో 134 మందిని జైల్లో ములాఖత్కు రప్పించుకొన్నట్లు జైళ్ల శాఖ రికార్డులు చెబుతున్నాయి. ప్రత్యేక సౌకర్యాలతో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న వీఐపీ ఖైదీలందరికన్నా జగన్వే ఎక్కువ ములాఖత్లున్నాయి. జగన్ను సోదరుడిగా, వైఎస్ను పితృసమానుడిగా చెప్పుకొనే మైనింగ్ డాన్ గాలి జనార్దనరెడ్డి రెండో స్థానంలో(86) ఉన్నారు. అయితే ఆయన ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులనే ఎక్కువసార్లు ములాఖత్లకు రప్పించుకొంటున్నారు. వీరిలో జగన్ తల్లి విజయమ్మ 19, అత్యధికంగా ఆయన భార్య భారతీరెడ్డి 36 సార్లు, సోదరి షర్మిల 9సార్లు జైలుకెళ్లి జగన్తో మాట్లాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more