ముఖ్యమంత్రి కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం పట్టించుకోనట్లు వ్యవహరించినంత మాత్రాన ప్రజలు చూస్తూ వూరుకోరని ఎంఐఎం హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలను ముస్లిం యువత వీధుల్లోకి వచ్చి ప్రశ్నిస్తోందని , ప్రజాప్రతినిధులైన మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మజ్లిస్ ది కీలక పాత్రని అసదుద్దీన్ అన్నారు. అవిశ్వాస సమయంలో ఈ ప్రభుత్వానికి తాము అండగా నిలబడ్డామని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఎంఐఎం ప్రకటిచింది. నాంపల్లీ దారుసలాంలో జరిగిన ఎంఐఎం పొలిట్ బ్యూరో భేటీ అనంతరం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఈ విషయాన్ని ప్రకటించారు, మద్దతు ఉపసంహరణపై రాష్ట్రపతి , గవర్నర్ కు లేఖలు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఉపసంహరణ నిర్ణయం పై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాల వల్లే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహిరించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి నేత్రుత్వంలోని ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం కాదన్నది తమ అభిప్రాయమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం పై తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. టీడీపీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు ఎంఐఎం పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మత సామరస్యం కాపాడిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ .. కాంగ్రెస్ కుతంత్రాల నుంచి ఎంఐఎం బయటపడినందుకు ఆ పార్టీని అభినందిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్, వైకాపాలు ముస్లింలను మోసం చేసే పార్టీలేనని గాలి విమర్శించారు. ఆయా పార్టీల కుట్రలను మైనార్టీలు గమనించాలని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more