ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. కొంతకాలం క్రితం తిరుపతి వచ్చిన ఆమె రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. అప్పుడే ఆమె యుపి నుండి ఎపికి తిరిగి వస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఎనిమిది నెలల క్రితం తిరుమల వచ్చిన ఆమె టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మంచి నాయకుడని, గతంలో మంచి పాలన అందించారని కితాబు ఇచ్చారు. అంతేకాదు తాను చంద్రబాబుకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆయనను వ్యతిరేకించినట్లా అని చెప్పారు. తన రాజకీయ జీవితం రాష్ట్రం నుంచే ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయ రంగప్రవేశానికి భగవంతుడ్ని వేడుకుంటానని చెబుతూ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే తన మనసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంకితం అని చెప్పారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పారు. తాను రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్లనే సినిమాల్లో నటించ లేకపోతున్నట్లు చెప్పారు.సినిమాలు అంటే తనకు ఇష్టమేనని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నానని చెప్పారు.
ఏ పార్టీలో చేరుతారని మీడియా ప్రశ్నించగా.. ప్రజలు ఎటువైపు వెళ్లమని చెబితే తాను అటు వైపుకు వెళ్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం తాను ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నందున అక్కడ ఉంటానని ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు. అయితే తన మనసు మాత్రం ఆంధ్ర ప్రజలకే అంకితమన్నారు. ఆమె మాటలను తరిచి చూస్తే మాత్రం ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే పోటీ చేస్తుందనే విషయం అర్థమవుతోంది. దీంతో ఆమె ఏ పార్టీలో చేరుతారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జయప్రదకు తెలుగులో అభిమానులు చాలా మంది ఉన్నారు. దీంతో ఆమె ఏ పార్టీలో చేరుతుంది, లాభం ఎంత నష్టం ఎంత అనే అంశంపై ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారట. అయితే సినీ స్టార్లను చూసి ఓట్లు వేసే కాలం పోయిందని మరికొంతమంది పెదవి విరుస్తున్నారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై జయప్రద తన సన్నిహితులు, రాజకీయ మిత్రులతో చర్చిస్తున్నారట. ఏదేమైనా జయప్రద రాజకీయ ఆరంగేట్రం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించిన తర్వాత ఆమె పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను తరిచి చూస్తున్న వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో రాష్ట్రం నుండే ప్రాతినిథ్యం వహించాలని భావిస్తే ఖచ్చితంగా టిడిపిలోనే చేరతారనే చర్చ సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more