నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన స్కూటర్ను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లడంపై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసుల నుంచి బలవంతంగా స్కూటర్ను తీసుకెళ్లబోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ మహిళా పోలీస్పైకి స్కూటర్ను దూకించాడు. దీంతో స్కూటర్ను పట్టుకుని రోడ్డుపై పడిన ఆమె గాయపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం భార్యతో కలిసి స్కూటర్పై వెళ్లిన బ్రజేష్కుమార్ భల్లూరియా, నలసోపరా ప్రాంతంలోని పాటంకర్ పార్క్ వద్ద నో పార్కింగ్ ఏరియాలో దానిని నిలిపాడు.
దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటర్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కాగా, బ్రజేష్కుమార్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్కూటర్ను బలవంతంగా పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే గేట్ వద్ద ట్రాఫిక్ మహిళా పోలీస్.. న్యాయవాది స్కూటర్ను అడ్డుకోబోయింది. గేటు వేసేందుకు ప్రయత్నించింది. అయితే న్యాయవాది మాత్రం తన స్కూటర్ ను ఏ మాత్రం ఆపకుండా ముందుకు దూసుకెళ్లేందుకు ఎక్సలేటర్ ఇవ్వడంతో.. గేటుతో అడ్డుకోబోయిన మహిళా కానిస్టేబుల్ రోడ్డుపై పడింది. ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి.
దీంతో న్యాయవాది బ్రజేష్ కుమార్ ను అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. కొందరి అతనిపై చేయిచేసుకోబోయారు. అయితే తాను న్యాయవాదినని, ఈ మహిళా కానిస్టేబుల్ ప్రతీరోజు తనను అడ్డుకుంటోందని.. అమెకు సంబంధించిన వీడియోలు కూడా తన వద్దనున్నాయని బ్రిజేష్ కుమార్ పేర్కోన్నారు. ఇదిలాఉండగా, మహిళా కానిస్టేబుల్ పై స్కూటర్ తో ఢీకొనబోయారని అతనితోపాటు అతడి భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ మహిళా పోలీస్ గత కొన్ని నెలలుగా తనను టార్గెట్ చేస్తున్నదని న్యాయవాది అయిన బ్రజేష్కుమార్ ఆరోపించాడు. కాగా, ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
On Camera, Mumbai Man Tries To Run Over Woman Cop For Towing Scooter https://t.co/vi4pHWMCQU pic.twitter.com/OP01vT3Pzm
— NDTV (@ndtv) September 28, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more