Chiranjeevi apologises for unruly fans గరికపాటిని ఎవరూ తప్పుగా మాట్లాడొద్దు: నాగబాబు

Garikipati issue fans should not spoil chiru s magnanimity

Chiranjeevi apologises to spiritual leader, Chiranjeevi apologises to Garikapati, Naga babu spiritual leader Garikapati Narasimha rao, Chiranjeevi apologises to Garikapati Narasimha Rao, Bandaru Dattatreya Alai Bhalai, Megastar chiranjeevi, Naga Babu, garikapati narasimha rao, Alai Balai, Bandaru Dattatreya, Kishan Reddy, Telangana, politics

Film actor and former Union minister K. Chiranjeevi tendered an apology to noted spiritual preacher Garikapati Narasimha Rao at Alai Balai after his fans disrupted the latter's speech. It all happened when fans made a beeline to take selfies with Chiranjeevi, distracting Narasimha Rao who was addressing the audience. The preacher requested Chiranjeevi to stop the photo session and come on to the stage, otherwise he would leave the venue.

'మాకు ఆ ఉద్దేశం లేదు..’ గరికపాటిని ఎవరూ తప్పుగా మాట్లాడొద్దు: నాగబాబు

Posted: 10/07/2022 07:34 PM IST
Garikipati issue fans should not spoil chiru s magnanimity

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు కావడంతో మెగా అభిమానులు అగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే అవధాని, పండితుడు అయిన గరికపాటి నరసింహారావుపై మెగా అభిమానులు ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరాదని తాజాగా నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ నాగబాబు మరో ట్వీట్ చేశారు. గరికపాటి లాంటి పండిత ఉద్దండుడు తమకు క్షమాపణలు చెప్పాలని తాము కోరుకోవడం లేదని.. అయితే పరిస్థితులను అర్థం చేసుకోవాలని మాత్రమే అన్నామని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన రాస్తూ..  'గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు.

జరిగిందిదే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకలో జరిగిన ఆసక్తికర సన్నివేశం మెగా ఫ్యాన్స్ కు గరికపాటికి మధ్య పోరపచ్చాలను పోడచూపింది. సరిగ్గా పండితులు గరికపాటి నరసింహారావు సమ్మెళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తరుణంలో అప్పటికే వేదికను అలంకరించిన మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఆయనతో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. లేదంటే తాను వెళ్లిపోతానని నిరసన తెలపడంతో.. చిరంజీవి వెంటనే వచ్చి గరికపాటికి నమస్కరించి పక్కన కూర్చున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles