Pilgrim crowd swells further at Tirumala తిరుమలలో భక్తల రద్దీ.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ...

Tirumala crowds of devotees have risen to tirumala

crowd of devotees, Hill Shrine Tirumala, Lord Sri Venkateshwara Swamy, Tamil devotees sacred day, Peratashi month third Saturday, Srivari Sarvadarshan, TTD facilities for devotees, pilgrim complex, Q lines near Gogarbham Dam, EO Dharma Reddy, Tamil devotees, Andhra Pradesh, devotional

The crowd of devotees in Tirumala increased tremendously. Pilgrims have been flocking to the hill lately more than ever. Devotees lined up in Tirumala from Friday morning to celebrate the third Saturday of the month of Peratashi, which is considered sacred by Tamil devotees. It takes 48 hours to Srivari Sarvadarshan. TTD provided facilities for devotees to rest in the pilgrim complex.

తిరుమలలో భక్తజన సందోహం.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ... ప్రవేశం నిలిపివేత

Posted: 10/08/2022 12:48 PM IST
Tirumala crowds of devotees have risen to tirumala

తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.

దసరా సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇక అత్యంత పవిత్రమైన పెరటాశి మాసంలోని మూడవ శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తమిళ భక్తులకు అనవాయితీగా వస్తోంది. దీంతో గురు, శుక్రవారాల్లోనే తమిళనాడుకు చెందిన భక్తజన సందోహం అత్యంత భారీ సంఖ్యలో తిరుమల కోండకు చేరుకుని శనివారం రోజున స్వామివారి దర్శనానికి వేచిచూసింది. కాగా కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు తిరుమలకు పెద్ద సంఖ్యలో రానీ భక్తులు ఈ సారి మాత్రం మలయప్ప స్వామి దర్శనానికి పోటేత్తారు.

ఈ నేపథ్యంలో దాదాపుగా భక్తుల క్యూలైను గోగర్భం డ్యామ్ వరకు చేరుకోవడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు. వారు రేపు ఉదయం 6 గంటలకు రావాలని సూచించారు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles