తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.
దసరా సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇక అత్యంత పవిత్రమైన పెరటాశి మాసంలోని మూడవ శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తమిళ భక్తులకు అనవాయితీగా వస్తోంది. దీంతో గురు, శుక్రవారాల్లోనే తమిళనాడుకు చెందిన భక్తజన సందోహం అత్యంత భారీ సంఖ్యలో తిరుమల కోండకు చేరుకుని శనివారం రోజున స్వామివారి దర్శనానికి వేచిచూసింది. కాగా కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు తిరుమలకు పెద్ద సంఖ్యలో రానీ భక్తులు ఈ సారి మాత్రం మలయప్ప స్వామి దర్శనానికి పోటేత్తారు.
ఈ నేపథ్యంలో దాదాపుగా భక్తుల క్యూలైను గోగర్భం డ్యామ్ వరకు చేరుకోవడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు. వారు రేపు ఉదయం 6 గంటలకు రావాలని సూచించారు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more
Oct 07 | వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలను చంపే వైరస్ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్ను క్యాన్సర్ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. ఇంగ్లండ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్... Read more