ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించిన ఓ మున్సిపాలిటీ కౌన్సిలర్ కు న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. కర్నాటకకు చెందిన ఓ కౌన్సిలర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నుంచి గెలుపొందిన స్థానిక కౌన్సిలర్ రవి శంకర్ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. స్థానిక నాయకుడైన రవిశంకర్ ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన సమాచారాన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘానికి తెలియపర్చడంలో తప్పులు చేశారని న్యాయస్థానం పేర్కొంది.
అయితే రవిశంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చాడని నిరూపించబడిందని పేర్కోన్న న్యాయస్థానం.. అతని ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. రవిశంకర్కు బీపీఎల్ కార్డు ఉన్నా.. అతను తన అఫిడవిట్లో 500 కేజీల ఆభరణాల గురించి వెల్లడించలేదని మెజిస్ట్రేట్ తెలిపింది. సీనియర్ సివిల్ జడ్జి గీతాంజలి ఈ కేసును విచారించారు. సిరా మున్సిపల్ కౌన్సిల్ 9వ వార్డు కౌన్సిలర్ రవిశంకర్ తన పూర్తి సమాచారాన్ని దాచాడని, ఆ కేసులో అతను దోషిగా తేలినట్లు కోర్టు చెప్పింది.
ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణప్ప..2021 డిసెంబర్లో కోర్టు కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని అఫిడవిట్లో రవిశంకర్ పేర్కొనలేదని ఆరోపణలు చేశాడు. కౌన్సిలర్ రవిశంకర్ వద్ద 500 కిలోల ఆభరణాలు ఉన్నాయని, 3.6 లక్షల కిరాయి వస్తుందన్న విషయాన్ని కూడా అఫిడవిట్లో చెప్పలేదని అతనిపై కేసు బుక్ చేశారు. రవిశంకర్ వద్ద బీపీఎల్ కార్డు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పాత క్రిమినల్ కేసుల గురించి అఫిడవిట్ లో ప్రస్తావించలేదని రవిశంకర్ కోర్టుకు తెలిపారు. తన వద్ద 499.5 కేజీల వెండి, 500 గ్రాముల బంగారం ఉన్నట్లు కోర్టుకు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more