Supreme Court notice to Centre for timely, transparent appointments in CVC విజిలెన్స్ లో దీర్ఘకాలిక ఖాళీల భర్తీలో జాప్యం.. ‘సుప్రీం’ నోటీసులు

Supreme court issues notice to centre on delay in appointment of cvc vigilance commissioners

Central Vigilance Commission, CVC vacancies, Supreme Court ,Common Cause, Prashant Bhushan, Central Government, Justice Sanjay Kishan Kaul, Justice Abhay S. Oka, NGO organisation, transparent filling of vacancies, timely filling of vacancies, integrity institution

he Supreme Court on Monday issued notice on a plea seeking timely and transparent filling of long pending vacancies in the Central Vigilance Commission so as to ensure that the Commission can effectively discharge its duties as an 'integrity institution'. A bench comprising of Justices Sanjay Kishan Kaul and Abhay S. Oka was considering a petition filed by NGO Common Cause through Advocate Prashant Bhushan.

విజిలెన్స్ లో దీర్ఘకాలిక ఖాళీల భర్తీలో జాప్యం.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

Posted: 09/05/2022 10:53 PM IST
Supreme court issues notice to centre on delay in appointment of cvc vigilance commissioners

కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్‌ (సివిసీ)లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను సకాలంలో భర్తీ చేయకపోవడం పట్ల కేంద్రప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం శ్రీముఖాలు జారీ చేసింది. తక్షణం సీవిసీలో ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ మేరకు నోటీసులు ఇచ్చింది. ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ.. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటీషన్ ను ఇవాళ విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, అభయ్‌ ఎస్‌ ఓకాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 17 జూలై, 2020 లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించిందని, ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు జరుగలేదని పేర్కొంది. అలాగే జూన్‌ 2021లో ఏర్పడే ఖాళీలను అంచనా వేస్తూ.. మే 4, 2021న సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ పోస్టు భర్తీకి డీఓపీటీ దరఖాస్తులను ఆహ్వానించిందని, దరఖాస్తు చివరి జూన్ 7, 2020గా కూడా పేర్కోందని తెలిపింది. అయితే ఉద్యోగ ప్రకటనను వెలువరించి ఏడాది గడిచినా ఇప్పటికీ నియామకాలు మాత్రం జరగలేదని పేర్కోంది.

ఉద్యోగ ప్రకటన అనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి అపాయింట్‌మెంట్‌ జరగలేదని పేర్కొంది. దీర్ఘకాలంగా ఉన్న ఖాళీలను సకాలంలో భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైందని పిటిషనర్‌ ఆరోపించారు. కమిషనర్‌లను ఎక్కువ కాలం పాటు నియమించకపోవడం, పౌరుల సమాచార హక్కుకు భంగం కలిగించడమేనని పిటిషనర్‌ ఆరోపించారు. జూలై 2020, మే 2021లో జారీ చేసిన ప్రకటనల ప్రకారం విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌లను నియమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. మూడువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles